శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
క్రితం సంచికలొ మనం మణక్కాల్ నంబి గురించి తెలుసుకున్నాం , ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం.

ఆళవందార్, కాట్టుమన్నార్ కోవెల
ఆళవందార్
తిరు నక్షత్రం : ఆషాడ మాసం ఉత్తరాషాడ నక్షత్రం
అవతారస్థలం :కాట్టుమన్నార్ కోయిల్ (వీరనారాయణపురం)
ఆచార్యులు: మణక్కాల్ నంబి
శిష్యులు: పెరియనంబి, పెరియ తిరుమలైనంబి, తిరుక్కోట్టియూర్ నంబి, తిరుమాలైఆన్డాన్, దైవవారి ఆన్డాన్, వానమామలైఆన్డాన్, ఈశ్వరాన్డాన్, జీయరాన్డాన్, ఆళవందారాళ్వాన్, తిరుమోగూరప్పన్, తిరుమోగూర్నిన్ఱర్, దేవపెరుమాళ్, మారనేరినంబి, తిరుక్కచ్చినంబి, తిరువరంగపెరుమాళ్ అరయర్(ఆళవందారుల కుమారుడు, మణక్కాల్ నంబి శిష్యులు), తిరుక్కురుగూర్ దాసర్, వకుళాభరణ సోమయాజియార్, అమ్మంగి, ఆళ్కొణ్డి, గోవిన్దదాసర్(వడమధురై లో ఙన్మించినవారు), నాథమునిదాసర్ (రాజ పురోహితుడు), తిరువరంగత్తమ్మాన్ (రాజ మహిషి).
శ్రీసూక్తి గ్రంథములు: చతుశ్శ్లోకి, స్తోత్త్రరత్నం, సిద్ధిత్రయం, ఆగమప్రామాణ్యం, గీతార్థ సంగ్రహము.
పరమపదించిన ప్రదేశం : శ్రీ రంగం.
యమునైతురైవన్ (యామునాచార్యులు) కాట్టుమన్నార్ కోయిల్ నందు ఙన్మించిరి. వీరు ఆళావందార్ అనే నామముతో ప్రసిద్దిగాంచిరి. వీరికున్న ఇతర నామాలు- పెరియముదలియార్, పరమాచార్యులు, వాదిమత్తేభ సింహేన్ద్రులు.
వీరు ఈశ్వరమునులకు కుమారులు మరియు నాథమునులకు మనుమడు. వీరు సామాన్యశాస్త్రం అనే విద్యను మహాభాష్యభట్టర్ వద్ద అభ్యసించిరి. ఆ సమయములో అక్కిఆళ్వాన్ (రాజ పురోహితుడు) రాజ్యంలోని పండింతులందరు శిస్తు కట్టవలెనని తన ప్రతినిధిని పంపిరి.(తాను అధికార పండితుడు కాబట్టి). ఆ వార్త విని మహాభాష్యభట్టర్ కలతచెందడము చూచి యమునైతురైవన్ తాను ఆ సమస్యను పరిష్కంచగలనని గురువుగారిని విచారపడవద్దని చెప్పిరి. వారు ఒక శ్లోకమును పత్రంపై ఇలా వ్రాసిరి- “ఎవరైతే చవకబారు ప్రచారం కొరకు ప్రయత్నిస్తారో వారిని నిర్మూలించెదను”. ఈ పత్రాన్ని అక్కిఆళ్వాన్ వద్దకు పంపిరి. అక్కిఆళ్వాన్ అది చూచి కోపంతో తన సైనికులను యమునైతురైవన్ ని రాజ్యసభకు తీసుకురమ్మని పంపిరి. అప్పుడు యమునైతురైవన్ తనకి సరియగు గౌరవం ఇస్తే వస్తానని చెప్పెను. అప్పుడు రాజు పల్లకి పంపగా యమునైతురైవన్ పల్లకిలో కూర్చొని సభకి వచ్చిరి.
సంవాద ఆరంభమున రాణి, ఈ సంవాదములో యమునైతురైవనే నిశ్చయముగా గెలుస్తాడని, ఒకవేళ ఓడిపోతే రాజుకు తాను పాదదాసిగా ఉంటానని మహారాజుతో పందెం కాసింది. రాజు అక్కిఆళ్వానే నిశ్చయముగా వాదంలో గెలుస్తాడని తన విశ్వాసం వ్యక్తం చేసి, ఒకవేళ అలా జరగని పక్షంలో తన అర్థ రాజ్యమును ఇస్తానని పందెం తిరిగి కాసెను.
అక్కిఆళ్వాన్ తన వాదప్రతిభయందు చాలా విశ్వాసముతో యమునైతురైవన్ ఏ ప్రశ్న అడిగినా దానిని ఖండించగలను అని చెప్పిరి. యమునైతురైవన్ క్రింది 3 ప్రశలను అడిగిరి.
- అక్కిఆళ్వాన్ తల్లి గొడ్రాలు.
- ఈ రాజు సార్వభౌముడు కాదు.
3. రాజపత్ని పతివ్రతకాదు.
ఇవి విని అక్కిఆళ్వాన్ కు నోటమాట రాలేదు. రాజు గారి భయము వలన ఏ ప్రశ్నను ఖండించలేకపోయెను. కాని యమునైతురైవన్ చాలా సులభముగ వాటికి సమాధానము ఇలా చెప్పిరి.
1.ఒకే సంతానం కలిగిన స్త్రీ గొడ్రాలికింద వచ్చును(శాస్త్రప్రకారం/కదలీ వంద్య).
2.సార్వభౌముడనగా ప్రపంచమును పరిపాలించవలెను కాని ఈ రాజు ఈ రాజ్యమునకే అధికారి.
- వివాహం శాస్త్రప్రకారము జరుగును దానిలో తంతుగా మొదలు పెళ్ళి కూతురు కొన్ని ప్రధాన మంత్రములచే దేవతలకు అర్పించబడును. కావున మహారాణి ప్రతివత కాదు.
అక్కిఆళ్వాన్ యమునైతురైవన్ శాస్త్రప్రావీణ్యమును అంగీకరించి వాదములో తన ఓటమిని ఒప్పుకొనిరి. యమునైతురైవన్ శాస్త్రప్రమాణంతో ఇచ్చిన వివరణతో విశిష్టాద్వైత సిద్దాంతమును స్థాపించిరి. అలాగే ఆ పరివారమందరు యమునైతురైవన్ కి శిష్యులుగా మారిరి. అప్పుడు రాణి వారిని “ఆళవందార్”(తనను పాలించుటకు/ రక్షించుటకు వచ్చిన వారు) అని సంభోధించినది. రాజు తన అర్థరాజ్యమును ఇచ్చివేసిరి.
గత సంచికలో మణక్కాల్ నంబి, ఆళవందార్లను శ్రీరంగమునకు తిరిగి తీసుకురావడము, సంప్రదాయమునకు ఆచార్యునిగా ఎలా తీర్చిదిద్దారో చూసాము. ఆళవందార్ శ్రీరంగమునకు వచ్చిన పిదప సన్యాసాశ్రమము స్వీకరించి సంప్రదాయమును విస్తరించిరి. చాలా మంది వీరికి శిష్యులు అయ్యారు.
ఒకసారి మణక్కాల్ నంబి, ఆళవందార్లను పిలిచి కురుగైక్కావలప్పన్ దగ్గరికి వెళ్ళి అష్టాంగయోగ రహస్యమును అభ్యసించమని ఆఙ్ఞాపించిరి. వారు అక్కడికి వెళ్ళగా కురుగైక్కావలప్పన్ యోగము ద్వారా భగవదనుభవములో నిమగ్నమై ఉన్నారు. కాని వారు ఆళవందార్ల రాకని గుర్తించి వారిని పలకరించిరి. యోగానుభవములో ఉన్నప్పుడు భగవానుడు నా భుజస్కందముల పై నుండి మిమ్మల్ని తదేకముగా చూస్తున్నారు కావున నాకర్థమైనది ఇక్కడ ఎవరో శొట్టనంబి (నాథమునుల) వంశమునకు చెందినవారు వచ్చి ఉన్నారని గమనించాను. భగవానునకు, నాథమునుల వంశముపై అధికమైనప్రీతి అని చెప్పిరి. ఆళవందార్లకు తాను యోగరహస్యమును ఉపదేశిస్తానని సమయమును పత్రం రాసిచ్చారు. కాని కురుగైక్కావలప్పన్ రాసిచ్చిన పత్రంలో ఉన్న సమయాన ఆళవందార్ తిరువనంతపురమును దర్శించుటకు వెళ్ళిరి. వెంటనే ఆళవందార్లకు యోగరహస్యము గుర్తుకురాగా ఆ పత్రమును చూడగా సమయం అయిపోయినదని గుర్తించారు.
ఆ సమయములో వారి శిష్యులైన దైవవారిఆన్డాన్ ఆచార్య ఎడబాటుని సహించలేక తిరువనంతపురమునకు బయలుదేరగా, అక్కడనుండి ఆళవందార్ శ్రీరంగమునకు తిరుగు ప్రయాణమయ్యారు. వారిద్దరు తిరువనంతపురము ముఖద్వారము దగ్గర కలుసుకొనిరి. దైవవారిఆన్డాన్ వారి ఆచార్యులను సేవించి చాలా సంతోషించి వారితో తిరుగు ప్రయాణమవ్వగా ఆళవందార్ వారిని అనంతశయన పెరుమాళ్ళను దర్శించుకోమన్నారు, దానికి వీరు పెరుమాళ్ళకన్నా మీరే మాకు ముఖ్యమనిరి. వారి ఆచార్య భక్తికి నిదర్శనం.
ఆళవందార్ తిరిగి శ్రీరంగమునకు చేరి తన తర్వాత ఈ సంప్రదాయ బాధ్యతలు ఎవరికి అప్పగించవలనని కలతచెందుతుండగా, ఇళయాళ్వార్ (శ్రీరామానుజులు) గుర్తుకు వచ్చిరి. ఇళయాళ్వార్ కాంచీపురములో యాదవప్రకాశులవద్ద విద్యను అభ్యసించుచున్నారు. ఆళవందార్ వరదరాజస్వామిని దర్శించి, కరియమాణిక్క పెరుమాళ్ సన్నిధిన నిలబడిరి. అదే సమయమున ఇళయాళ్వార్ విద్యార్థుల గోష్ఠితో ఆ వైపు వచ్చిరి. ఆళవందార్ తమ కటాక్షములను ఇళయాళ్వార్ పై కృపచేసారు. ఆళవందార్, దేవపెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళి ఇళయాళ్వార్లని తమ తర్వాత దర్శనాస్థాపకులుగా చేయమని ప్రార్థించిరి. అలా ఆళవందార్ విత్తనము నాటి మహావృక్షమును చేసిరి, అదే ‘ఎమ్పెరుమానార్ దర్శనం‘. ఆళవందార్, ఇళయాళ్వర్ల ఆధ్యాత్మిక ఙ్ఞానాభివృద్దికై సహకరించవలసినదని తిరుక్కచ్చినంబిని ఆఙ్ఞాపించారు.
ఆళవందార్లు తమ చరమదశలో తన శిష్యులందరిని తిరువరంగపెరుమాళ్ అరయర్ ని ఆశ్రయించమని చెప్పి కొన్నిసూచనలు చేసిరి.
వాటిలో విలువైనవి కొన్ని
- దివ్యదేశ కైంకర్యమే మన జీవన కర్త్యవము, దానికై కొంత సమయమును విధిగా వెచ్చించాలి.
- పెరియపెరుమాళ్ (పాదము నుండి తిరుముఖమండలం వరకు) శ్రీచరణములందు వేంచేసి ఉన్న తిరుప్పాణాళ్వార్ ని సేవించాలి. ఎల్లప్పుడు తిరుప్పాణాళ్వర్లనే సేవించేవారు. ఆళ్వారే ఉపాయము మరియు ఉపేయమని భావించాలి(తిరువరంగ పెరుమాళ్ అరయర్ ఎల్లప్పుడు వారినే ఆరాధించేవారు). అలానే వారు తిరుప్పాణాళ్వార్(పెరియ పెరుమాళ్ళ గురించి పాడిరి), కురువరుత్త నంబి(తిరువేంగడ పెరుమాళ్ళకి మట్టి పూలని సమర్పించినవారు) మరియు తిరుక్కచ్చి నంబి( దేవరాజ పెరుమాళ్ళకు తిరువాలవట్ట కైంకర్యము చేసినవారు) గురించి చెప్పేవారు.
- ప్రపన్నులు ఎప్పుడు తన ఆత్మయాత్ర(భగవద్విషయము) గురించి కాని దేహయాత్ర (లౌకికము) గురించికాని చింతింపరాదు. ఆత్మ ఎప్పుడూ భగవానుని పారతంత్ర్యమే, ఆత్మయాత్ర గురించి భవానుడే చూసుకొనును. అలానే దేహము కర్మద్వారా నడుచును. మన దేహయాత్ర మన పుణ్యము/ పాపములే నడిపించును. అందువలన మనము వాటి గురించి చింతించకూడదు.
- మనము ఎప్పుడు భాగవతాపచారము చేయరాదు, వారిని సదా భగవానునితో సమానముగాగౌరవించవలెను.
- భగవానుని శ్రీచరణతీర్థమును ఎలాగైతే స్వీకరిస్తామో అలానే ఆచార్య శ్రీపాదతీర్థమును కూడా స్వీకరించవలెను.
- ఆచార్య పురుషులు శ్రీపాదతీర్థమును ఇతరులకు ఇస్తున్నప్పుడు, తాను తమ ఆచార్యుని ప్రతినిధిగా భావించి ఇవ్వాలి (స్వతంత్రించరాదని భావం). వాక్యగురుపరంపరను/ ద్వయమంత్రానుసంధానము చేస్తూ ఇవ్వవలెను.
చివరగా తమ శిష్యులను మరియు ఇతర శ్రీ వైష్ణవులందరిని సమావేశపరచి తన కర్తవ్యనిర్వాహణలో ఏమైనా దోషములున్న మన్నించమనిరి. వారి శ్రీపాదతీర్థమును తీసుకొని, వారందరికి తదీయారాధన చేసి తమ చరమతిరుమేనిని వదిలి పరమపదమును చేరిరి. వారి శిష్యులందరు బాధతో వారి చరమకైంకర్యమునకు గొప్పగా ఏర్పాట్లు చేయసాగిరి. ఎవరైన శ్రీవైష్ణవులు పరమపదము చేరితే అది వరముగా భావించి వారికి చాలా వైభవముగా చరమకైంకర్యమును నిర్వహించుచుందురు. చరమకైంకర్యములో తిరుమంజనము, శ్రీచూర్ణపరిపాలనము, అలంకారము, బ్రహ్మరథము మొదలైనవి ఉంటాయి.
ఇలా ఉండగా పెరియనంబి కాంచీపురమునుండి ఇళయాళ్వార్లని తమతో శ్రీరంగమునకు తీసుకురావడానికి వెళ్ళిరి. అప్పుడు ఇళయాళ్వార్ దేవపెరుమాళ్ తీర్థకైంకర్యమునకై శాలక్కిణర్ బావి దగ్గర ఉండెను. పెరియనంబి అక్కడకువెళ్ళి ఆళవన్దార్ల స్త్రోత్రరత్నమును బిగ్గరగా పఠించారు. ఇది విన్న ఇళయాళ్వార్ వాటి లోతైన అర్థములకు ముగ్థుడై, పెరియనంబిని ఆ శ్లోకములను ఎవరు రచించారని అడిగిరి. అప్పుడు పెరియనంబి ఆళవన్దార్ల గొప్పతనమును గురించి చెప్పి తమతో పాటు ఇళయాళ్వార్లని శ్రీరంగమునకు రావలసినదిగా కోరిరి. ఇళయాళ్వార్ వారి కోరికను మన్నించి దేవపెరుమాళ్, తిరుక్కచ్చినంబిల వద్ద ఆఙ్ఞతీసుకొని శ్రీరంగమునకు బయలుదేరిరి. వారు శ్రీరంగసమీపమునకు చేరుతుండగా ఆళవందార్ల చరమయాత్ర్రని చూసి పెరియనంబి క్రిందపడి దు:ఖించుచుండగా, ఇళయాళ్వార్ అక్కడ ఉన్న శ్రీవైష్ణవులని విచారించి, ఏమి జరిగినదో గ్రహించిరి.
ఆ సమయములో ఆళవందార్లకు చరమకైంకర్యము సమయాన అక్కడి వారందరు వారి చేతివేళ్ళలో మూడు వేళ్ళు ముడుచుకొని ఉండడము గమనించగా, ఇళయాళ్వార్ దాని కారణము అడుగగా, శ్రీ వైష్ణవులు ఆళవందార్ల 3 తీరని కోరికల గురించి చెప్పిరి. అవి:
- వ్యాసపరాశరుల ఉపకారమునకు మనము కృతఙ్ఞతని చూపవలెను.
- నమ్మాళ్వార్ల యందు అధికాభిమనమును ప్రదర్శించవలెను.
- వ్యాసుని బ్రహ్మసూత్రములకు విశిష్టాద్వైతపరముగా భాష్యమును రచించవలెను.
అవి విన్న ఇళయాళ్వార్ వెంటనే ఆ మూడు కోరికలను తాను పూర్తిచేయుదనని ప్రమాణముచేయగా ఆళవందార్ల వేళ్ళు తెరుచుకొనెను. అక్కడ గుమికూడిన శ్రీవైష్ణవులు అది చూచి ఆనందపరవశులై, ఆళవందార్ల కృప మరియు శక్తి పూర్తిగా వీరియందు ఉండునని, మన దర్శననిర్వాహణకై వీరు వచ్చినారని ఆనందించిరి. చరమకైంకర్యములు పూర్తైన పిమ్మట ఇళయాళ్వార్, ఆళవందార్ ఇకలేరనే బాధతో నంపెరుమాళ్ళని దర్శించకుండానే కాంచీపురమునకు తిరిగివచ్చిరి.
ఆళవందార్లు ఉభయవేదాంతములలో గొప్ప పండితులు. చాలా సులభముగా శ్రీసూక్తులను వారి గ్రంథములను నుండి అర్థముచేసుకోవచ్చును.
* పిరాట్టి తత్త్వమును చతుశ్శ్లోకి లోని 4 శ్లోకముల ద్వారా వివరించిరి.
*స్త్రోత్రరత్నము నిజముగా ఒక రత్నమే- శరణాగతి యొక్క భావమును (తిరువాయ్ మొజిలో వివరించిన విధముగా) చాలా సులభంగా శ్లోకముల ద్వారా అందించిరి.
*గీతార్థసంగ్రహం ద్వారా గీతలోని తత్త్వమును వెలికితీసిరి.
* ఆగమప్రామాణ్యము,- శ్రీపాంచారాత్రాగమ ప్రాముఖ్యతని, ప్రాబల్యమును గుర్తించిన మొదటి గ్రంథము.
ఆళవందార్ తనియన్ :
యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః |
వస్తుతాముపయాతో2హం యామునేయం నమామి తం ||
ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ నాశనము చెందినవో మరియు ఒక వస్తువుగా గుర్తించబడ్డానో పూర్వము అసత్ (అచేతనము)గా ఉండి యామునాచార్యుల పాదముల ధ్యానముతో ప్రస్తుతం సత్(ఆత్మ/ చేతనము) గా భావిస్తున్నానో ఆ శ్రీయామునాచార్యులకు నమస్కరిస్తున్నాను.
తదుపరి సంచికలో పెరియనంబి వైభవమును తెలుసుకుందాము.
అడియేన్ :
రఘు వంశీ రామానుజదాసన్.
Pingback: పెరియ నంబి | guruparamparai telugu
Pingback: పరాశర భట్టర్ | guruparamparai telugu
Pingback: తిరువాయ్ మొజి పిళ్ళై | guruparamparai telugu
Pingback: అజగియ మణవాళ మామునిగళ్ | guruparamparai telugu
Pingback: తిరుక్కచ్చి నంబి | guruparamparai telugu
Pingback: కురుగై కావలప్పన్ | guruparamparai telugu
Pingback: పెరియ తిరుమలై నంబి | guruparamparai telugu
Pingback: తిరుక్కోష్టియూర్ నంబి | guruparamparai telugu
Pingback: mARanEri nambi | guruparamparai telugu
Pingback: 2014 – Aug – Week 2 | kOyil
Pingback: పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ | guruparamparai telugu
Pingback: కిడాంబి ఆచ్చాన్ | guruparamparai telugu
Pingback: వేదవ్యాస భట్టర్ | guruparamparai telugu
Pingback: పెరియవాచ్చాన్ పిళ్ళై | guruparamparai telugu
Pingback: నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై | guruparamparai telugu
Pingback: sri yAmunAchArya (ALavandhAr) | AchAryas
Pingback: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ | guruparamparai telugu
Pingback: పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ | guruparamparai telugu