శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
గత సంచికలో నము ఆళవందార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం.

పెరియ నంబి – శ్రీ రంగం
తిరు నక్షత్రం : మార్గశిర మాసము, మఘ నక్షత్రము
అవతారస్థలం : శ్రీ రంగం
ఆచార్యులు : ఆళవందార్
శిష్యులు : ఎమ్పెరుమానార్, మలై కునియ నిన్ఱార్, ఆరియూరిల్ శ్రీ శఠగోప దాసర్, అణియరంగత్త ముదనార్ పిళ్ళై, తిరువాయ్ క్కులముడైయార్ భట్టర్, ఇత్యాదులు.
వీరు పరమపదించిన ప్రదేశము : పశియతు (పశుపతి?) కోయిల్ చోల దేశము.
పెరియ నంబి వారు శ్రీ రంగము నందు జన్మించిరి. వీరికి మహా పూర్ణర్, పరాంకుశ దాసర్ మరియు పూర్ణాచార్యర్ అను నామధేయములు కూడ కలవు.
ఆళవందార్ల శిష్య బృందములో పెరియ నంబి ప్రముఖులు. వీరు రామానుజలను శ్రీ రంగమునకు తెచ్చుటలో ముఖ్య పాత్ర వహించారు. ఆళవందార్లు తరువాత శ్రీ రంగము నందు ఉన్న శ్రీ వైష్ణవులందరూ రామానుజులను తీసుకురావలసిందిగా పెరియ నంబిని కోరెను. కావున వారు శ్రీ రంగమును వీడి కాంచిపురమునకు బయలుదేరెను. అదే సమయమున రామానుజులు కూడ పెరియ నంబిని కలుసుకొనుటకు శ్రీ రంగమునకు బయలుదేరెను. వారిరువురు మధురాంతకం నందు కలుసుకొనెను. పెరియ నంబి అక్కడే రామానుజులకు పంచ సంస్కారములను గావించెను. వారు ఆ పిమ్మట సాంప్రదాయ రహస్యములను రామానుజులకు నేర్పించుటకు కాంచిపురమునకు వెళ్ళెను. కాని రామానుజుల వారి ధర్మ పత్ని వలన కొన్ని ఇబ్బందులు కలుగడం చేత వారు కాంచిపురమును వీడి శ్రీ రంగమునకు వెళ్ళవలసి వచ్చెను.
మనకు పూర్వాచార్యుల శ్రీ సూక్తులలో పెరియ నంబి వారి జీవితము గురించి అనేక చోట్ల ప్రస్ధావించబడి ఉన్నది.
- వారు పూర్తి ఆత్మ గుణములను కలవారు. వారికి రామానుజులు అంటే చాల ప్రియం. వారి కుమార్తె లౌకిక విషయముల యందు సహాయము కొరకు వచ్చినను; వారు రామానుజుల వద్దకు వెళ్ళమని వారి సలహా తీసుకోమని చెప్పెను.
- ఒకనాడు రామానుజులు వారి శిష్య బృందముతో పోవుచుండగా; పెరియ నంబి వారికి సాష్టాంగ ప్రణామమును చేసెను. అప్పుడు రామానుజులు వారి నమస్కారమును స్వీకరించ లేదు. పెరియ నంబిని ఎందుకు అల చేసారు అని అడుగగా; వారు రామానుజులలో ఆళవందార్లను చూసినట్లు చెప్పెను. ‘వార్తా మాలై’ అను గ్రంధమున ఆచార్యులకు వారి శిష్యుల పట్ల చాల గౌరవము ఉండవలెను అని చెప్పబడి ఉంది. పెరియ నంబి దానిని అనుష్టానములో పెట్టిన మహనీయులు.
- ఒకనాడు మారనేరి నంబి (చతుర్ద వర్ణము నందు జన్మించిన మహోన్నతమయిన శ్రీ వైష్ణవుడు) అను ఒక ఆళవందార్ శిష్యులు పరమపదించెను. పెరియ నంబి వారికి చరమ కైంకర్యమును కావించెను. కొంత మంది శ్రీ వైష్ణవులకు అది నచ్చక; రామానుజులకు ఫిర్యాదు చేసెను. రామానుజులవారు ఈ విషయమును అడుగగ; పెరియ నంబి ఈ విధముగ సమాధానమునిచ్చెను. వారు ఆళ్వార్ల తిరువాయ్మొళి, పయిలుమ్ చుడరొళి (3.7) మరియు నెడుమార్కడిమయ్(8.10) పదిగము ప్రకారము ఆళ్వార్ల వారి తిరువుళ్ళం ( కోరిక ) ప్రకారము నడుచుకొనెనని సమాధానమునిచ్చెను. ఈ వృత్తాంతము అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయము నందు మరియు గురు పరంపరా ప్రభవము నందు చెప్పబడెను.
- ఒకనాడు కొందరి వలన పెరియ పెరుమాళ్ళకు ఆపద అని తెలుసుకొని; పెరియ నంబి ఉత్తముడని వారిని పెరియ కోయిలను ప్రదక్షిణము చేయమని అక్కడ ఉన్నవారు అడిగెను. వారు కూరత్తాళ్వాన్లను వారితో కూడా రమ్మని అడిగెను. ఎందుకనగ; కూరత్తాళ్వాన్లు పారతంత్రియమును పూర్తిగ అర్ధము చేసుకున్నవారు. ఈ వృత్తాంతమును తిరువాయిమొళి(7.10.5), ఈడు వ్యాఖ్యానమున నంపిళ్ళై వారు వివరించారు.
- వీటి అన్నింటికి మకుటముగా; ఒకనాడు శైవ రాజు రామానుజులను తన ఆస్ధానమునకు రమ్మని కబురు చేయగ; కూరత్తాళ్వాన్లు మారు వేషములో వెళ్ళెను. వారితో తోడుగ పెరియ నంబి వారు వృద్ధుడు అయినప్పటికి కూడ అనుసరించెను. ఆ రాజు పెరియ నంబి మరియు కూరత్తాళ్వాన్ల కళ్ళని పెళ్ళగించమనగ; పెరియ నంబి దానికి అంగీకరించెను. వృద్ధాప్యము వలన ఆ నొప్పి భరించలేక; వారు పరమపదించెను. పరమపదించు సమయమున వారు మనకు ఒక ముఖ్యమయిన సందేశమునిచ్చెను. ఆళ్వాన్లు మరియు అత్తుళై (పెరియ నంబి కుమార్తె) శ్రీ రంగము కొద్ది క్రోసుల దూరములో ఉంది; ఒపిక పట్టి ఉండ గలిగితె శ్రీ రంగము నందు దేహమును వీడవచ్చు అని చెప్పెను. కాని పెరియ నంబి వారికి వద్దు అని చెప్పి; వెంటనే అక్కడే పరమపదించెను. ఎవరయిన ఈ విషయమును విని; శ్రీ రంగమున (లేక ఏ ఇతర దివ్య దేశములలో అయిన) నివశించుట కేవలం తమ దేహమును వీడుటకు అని నిర్ధారణకు వస్తే; శ్రీ వైష్ణవుల కీర్తి అక్కడే ఆగిపోతుంది అని వారు ఈ విధముగ చేసెను. ఆళ్వార్లు ఈ విధముగ చెప్పెను “వైకుంఠమ్ ఆగుమ్ తమ్ ఊరెల్లామ్” అనగ ఎక్కడయితే శ్రీ వైష్ణవులు ఉండునో ఆ ప్రదేశము వైకుంఠమగును. అందువలన మనము సర్వ కాలములలో, సర్వ అవస్ధలలో ఎమ్పెరుమాన్ల మీద ఆధారపడి ఉండటం మనము తెలుసుకోవలసిన ముఖ్యమయిన విషయం. దివ్య దేశములలో చాల మంది ఈ వరము యొక్క గొప్ప తనము తెలియక నివశిస్తున్నారు. అదే విధముగ చాల మంది (చాండిలి – గరుడ వృత్తాంతము చూసినట్లు అయితే) దూర ప్రాంతములలో ఉండి కూడ ఎమ్పెరుమాన్ల గురించి ధ్యానము చేస్తు తరించే వారు ఉన్నారు.
పెరియ నంబి వారు ఎంతటి ఉత్తములో ఈ పైన వృత్తాంతములను చూసి తెలుసుకోవచ్చును. వారు పూర్తిగ ఎమ్పెరుమాన్ల మీద ఆధారపడి ఉండెడి వారు. నమ్మాళ్వార్లకు మరియు వారి తిరువాయ్మొళి యందు ఉన్న అపారమయిన ప్రేమ వలన వారు పరాంకుశ దాసర్ అని కూడ ప్రసిద్ధి పొందారు. వారు శ్రియః పతి యొక్క కళ్యాణ గుణానుభవంలో మునిగి పోయి నిరంతర ఆనందమును పొందేవారని వారి తనియన్ చూసి తెలుసుకోవచ్చును. మనము కూడ వారి శ్రీ పాద పద్మములను పట్టి మనకు కూడ అలాంటి యోగ్యతను ప్రసాదించమని వేడుకుందాము.
పెరియ నంబి తనియన్
కమలాపతి కల్యాణ గుణామ్రుత నిషేవయా
పూర్ణ కామాయ సతతం పూర్ణయ మహతే నమః
సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస
మూలము: https://guruparamparai.wordpress.com/2012/09/01/periya-nambi/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Pingback: emperumanar – ఎమ్పెరుమానార్ Dinesh Ramanuja Dasa | guruparamparai telugu
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: శ్రీవైష్ణవ తిరువారాధనము | srIvaishNava granthams – Telugu
Pingback: తిరుక్కచ్చి నంబి | guruparamparai telugu
Adiyen
Some people called NAMBI intalukas, villages, towns and mandals in mahaboobnagar district Telangana state. Are they srivaishnavas or not. if yes request you please clarify how they srivaishnavas and who are their acharyas.
Adiyen dasan,
P.SRINIVAS
Pingback: mARanEri nambi | guruparamparai telugu
Pingback: కూరత్తాళ్వాన్ | guruparamparai telugu
Pingback: ముదలియాణ్డాన్ | guruparamparai telugu
Pingback: 2014 – Dec – Week 4 | kOyil
Pingback: తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు | guruparamparai telugu
Pingback: పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ | guruparamparai telugu