శ్రీ
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవర మునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
జై శ్రీమన్నారాయణ
తిరు నక్షత్రము~: ఆశ్వయుజ మాసము,పుష్యమి.
అవతారస్థలము~: తెలియదు
ఆచార్యులు~: మణవాళమామునులు.
పరమపదము చేరిన ప్రదేశము~: శ్రీపెరుమ్బుదూర్.
ఆది యతిరాజ జీయర్ గారే యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్ (ఎమ్పెరుమానార్ యొక్క అవతార స్థలము ) స్థాపించారు.

యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్
యతిరాజ జీయర్ ముఠమునకు ఒక ప్రత్యేకత కలదు. అది ఏమనగా, కోవెల లో కైంకర్యము చేయుటకు మరియు కైంకర్య నిర్వహణ చూచుటకు గాను ఆళ్వార్/ఆచార్యులు స్థాపించిన కొద్ది మఠములలో ఇది ఒకటి. ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానారు సంవత్సరము మొత్తము ఇక్కడికి వేంచేస్తారు.

యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్
వీరు మామునులు, పొన్నడిక్కల్ జీయర్(వానమామలై), కోయిల్ కందాడై అన్నన్, దొడ్డయాచార్యులు మొదలైన వారి తో సత్సంబంధాలు కలిగివున్నారని వీరి తనియన్ ద్వారా తెలుస్తున్నది. వీరందరి శ్రీ చరణాలవద్ద శాస్త్ర అర్థాలను నేర్చుకున్నారు.
వీరి వాళి తిరునామము లందు శ్రీమద్రామానుజుల మీద వీరికి గల అప్పారమైన భక్తి తెలుస్తుంది.వీరి వాళి తిరునామము మామునుల వాళి తిరునామము పోలి వుంటుంది.
పరమస్వామి (తిరుమాలిరుంచోలై కళ్ అళగర్) ఆదేశముల మేరకు, మామునిగళ్ వారి ఒక్క ఆంతరంగిక కైంకర్యపరుల లో ఒక్కరైన యతిరాజ జీయర్ ని తిరుమాలిరుంచోలై కోవెల ను పునరుద్దరించి, సంస్కరించుటకు పంపారని యతీన్ద్ర ప్రవణ ప్రభావమ్ లో చెప్పారు. కొందరు యతిరాజ జీయర్ ని శ్రీపెరుమ్బూతూర్ ఆది యతిరాజ జీయర్ గా పరిగణిస్తారు, మరి కొందరు ఆ యతిరాజ జీయర్ వేరని , వీరె తదుపరి కాలము లో తిరుమాలిరుంచోలై జీయర్ ముఠమునకు మొదటి జీయర్ అయ్యరాని భావిస్తారు.పెద్దల వద్ద దీని గురించి మరింత తెలుసుకొవచ్చును.
వీరిని గురించి మనకు ఇంతవరకే తెలుస్తున్నది. భగవత్,భాగవత,ఆచార్య కైంకర్య ప్రాప్తి కోసము మనము వారి శ్రీచరణాలను ఆశ్రయించి తరించుదాము.
తిరుమాలిరుంచోలై జీయర్ తనియన్:
శ్రీమత్ రామానుజాంగ్రి ప్రణవ వరమునే: పాదుకమ్ జాతభ్రుంగమ్
శ్రీమత్ వానాద్రి రామానుజ గణగురు సత్వైభవ శోత్రదీక్షమ్
వాదూల శ్రీనివాసార్య చరణశరణమ్ తట్ కృపా లబ్ద భాష్యమ్
వందే ప్రాఙ్ఞమ్ యతీంద్రమ్ వరవరదగురో;ప్రాప్త భక్తామృతార్థమ్
అడియేన్ చూడామణి రామానుజదాసి