శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
క్రిత సంచికలో మనం శ్రీ వైష్ణవగురుపరంపర గురించి విశదీకరించుకున్నాము.
శ్రియఃపతి (లక్ష్మీనాథుడు) అయిన ఎమ్పెరుమాన్ (శ్రీమన్నారాయణుడు) పరిపూర్ణ దివ్యకళ్యాణగుణములతో నిత్యము శ్రీ వైకుంఠము నందు తన దివ్యమహిషులతో (శ్రీభూనీళాదేవేరులు) మరియు అనంతకళ్యాణగుణములు కలిగిన అనంతగరుడ విష్వక్సేనాది నిత్యసూరిగణములతో ప్రతినిత్యము కైంకర్యములు పొందుతు ఉంటారు. శ్రీ వైకుంఠము నిత్యము ఆనందముతో శోభాయమానముగాఉండును. ఎమ్పెరుమాన్ అక్కడ ఆనందమును అనుభవించుచున్నప్పటికిని వారి హృదయం సదా సంసారమందు దుఃఖమును అనుభవిస్తున్న జీవాత్మల (అనాదిగా ఉన్న)యందే ఉండును.
జీవాత్మ మూడు విధములు:
- నిత్యులు : ఎల్లప్పుడు పరమపదమునందుండెడి వారు( కర్మచేత ఈ సంసారలోక సంపర్కం లేని వారు)
- ముక్తులు: సంసారమున ఒకనాడు ఉండి మొక్షమును పొందినవారు.
- బధ్ధులు~: సంసారమునందు కర్మచే బధ్ధుడై ఎంపెరుమాన్ తో సంబంధము కలిగి ఉన్నవాడు. (పితా-పుత్ర మరియు శేష- శేషి సంబంధము కల). ఈ సంబంధము వలన భగవంతుడు ఈ బధ్ధజీవునకు సదా అనుగ్రహిస్తు వారిని శ్రీవైకుంఠమునకు రప్పించి నిత్యకైంకర్యపరునిగా చేయాలని ఆరాటపడుతుంటాడు.
శాస్త్రమునందు చెప్పినటుల మోక్షము పొందుటకు తత్త్వజ్ఞానము అవసరము. రహస్యత్రయమందు ఈ తత్త్వజ్ఞానము స్పష్ఠముగా వివరించబడి ఉన్నది. జీవులకు ఈ తత్త్వజ్ఞానమును బోధించి జీవాత్మలను సంసారబంధము నుండి విముక్తిని కలిగించే వారినే ఆచార్యులంటారు. ఈ ఆచార్యుని పాత్ర విశేషమైనది కావున భగవంతుడే ఆచార్యునిగా అవతరించుటకై సిధ్ధపడును. కావున తానే ప్రధమాచార్యుడు. తాను ఆచార్యునిలా వేంచేసిఉన్న స్థలములను మన పూర్వాచార్యులు ఇలా వివరించారు.
- శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమమునందు నారాయణ ఋషిగా(ఆచార్యునిగా)అవతరించి, తన అవతారమైన (శిష్యునిగా) నరఋషికి తిరుమంత్రమును ఉపదేశించెను.
- ఎమ్పెరుమాన్ విష్ణులోకమందు ద్వయమంత్రమును పెరియపిరాట్టి(శ్రీలక్ష్మీదేవికి)కి ఉపదేశించెను.( ఈ క్రమముననే శ్రీవైష్ణవగురుపరంపర ఆరంభమయినది).
- ఎమ్పెరుమాన్ పార్ధసారథిగా కురుక్షేత్రమున అర్జునునకు చరమశ్లోకమును ఉపదేశించెను.
సమగ్ర గురుపరంపర ఇక్కడ చూడండి http://kaarimaaran.com/downloads/guruparambarai.jpg. శ్రీరంగమునందు వేంచేసియున్న పెరియపెరుమాళ్ మరియు పెరియ పిరాట్టి సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడే . ఓరాణ్ వళి గురుపరంపర లోని క్రమానుసారం పెరియ పెరుమాళ్ తో ఆరంభమగును.
- పెరియ పెరుమాళ్
- పెరియ పిరాట్టి
- సేనై ముదలియార్
- నమ్మాళ్వార్
- శ్రీమన్నాథమునులు
- ఉయ్యక్కొండార్
- మణక్కాల్ నంబి
- ఆళవందార్
- పెరియనంబి
- ఎమ్పెరుమానార్
- ఎంబార్
- పరాశరభట్టర్
- నంజీయర్
- నంపిళ్ళై
- వడక్కు తిరువీధిపిళ్ళై
- పిళ్ళై లోకాచార్యులు
- తిరువాయ్ మొళిపిళ్ళై
- అళగియ మనవాళ మామునిగల్
శ్రీ వైష్ణవగురుపరంపరలో ఆళ్వారులతో పాటు ఆచార్యులను కూడ చేర్చి ఒకేభాగముగా వ్యవహరించెదరు. ఆళ్వారుల క్రమం.
- పోయ్ ఘై ఆళ్వార్
- భూదత్తాళ్వార్
- పేయాళ్వార్
- తిరుమజిశై ఆళ్వార్
- మధురకవి ఆళ్వార్
- నమ్మాళ్వార్
- కులశేఖరాళ్వార్
- పెరియాళ్వార్
- ఆండాళ్
- తొండరడిప్పొడి ఆళ్వార్
- తిరుప్పాణాళ్వార్
- తిరుమంగైఆళ్వార్
కొంతమంది ఆచార్యుల(ఓరాణ్ వళి గురుపరంపరలో లేని)ను కూడ కొంత పరిమితితో ఇక్కడ చేర్చడం జరిగింది.
- శెల్వనంబి
- కురుగై కావలప్పన్
- తిరుకణ్ణమంగై ఆండాన్
- తిరువరంగప్పెరుమాళ్ అరయర్
- తిరుక్కోష్ఠియూర్ నంబి
- పెరియ తిరుమలైనంబి
- తిరుమలై ఆండాన్
- తిరుక్కచ్చి నంబి
- మాఱినేరినంబి
- కూరత్తాళ్వాన్
- ముదలియాండాన్
- అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్
- కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్
- కిడాంబి ఆచ్చాన్
- వడుగనంబి
- వంగీపురత్తునంబి
- సోమాశి ఆండాన్
- పిళ్ళై ఉఱంగావిల్లిదాసర్
- తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్
- కూరనారాయణ జీయర్
- ఎంగళాళ్వాన్
- అనంతాళ్వాన్
- తిరువరంగత్తు అముదనార్
- నడాదూర్ అమ్మాళ్
- వేదవ్యాస భట్టర్
- శ్రుత ప్రకాశికా భట్టర్ (సుదర్శన సూరి)
- పెరియవాచ్చాన్ పిళ్ళై
- ఈయుణ్ణి మాధవ పెరుమాళ్
- ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్
- నాలూర్ పిళ్ళై
- నాలూరాచ్చాన్ పిళ్ళై
- నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్
- పిన్బళగియ పెరుమాళ్ జీయర్
- అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్
- నాయనారాచ్చాన్ పిళ్ళై
- వాదికేసరి అళగియ మనవాళ జీయర్
- కూరకులోత్తమ దాసులు
- విళాన్ శోలై పిళ్ళై
- వేదాన్తాచార్యులు
- తిరునారాయణపురత్తు ఆయ్ జనన్యాచార్యులు
మణవాళ మాములు వేంచేసి ఉన్న కాలములో మరియు ఆ తరువాతి కాలములో వైభవం కలిగిన పలువురు ఆచార్యులు(పరిమితిలో) :
- పొన్నడిక్కాల్ జీయర్
- కోయిల్ కందాడై అణ్ణన్
- ప్రతివాది భయంకరం అణ్ణన్
- పతన్గి పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్
- ఎఱుంబిఅప్పా
- అప్పిళ్ళై
- అప్పిళ్ళార్
- కోయిల్ కన్దాడై అప్పన్
- శ్రీపెరుమ్బుదూర్ ఆది యతిరాజజీయర్
- అప్పాచ్చియారణ్ణ
- పిళ్ళైలోకమ్ జీయర్
- తిరుమళిశై అణ్ణావప్పన్గార్
- అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్, ఇంకను కలరు ……
పైన చెప్పబడిన ఆచార్యపురుషుల జీవితచరిత్రను వీలైనంతగా రాబోవు సంచికలలో చూడవచ్చును.
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
జై శ్రీమన్నారాయణ అడియేన్ .!
Source
Pingback: దివ్య దంపతులు | guruparamparai telugu
Sarvebhyo puurvaachaaryeebhyoo namaha.
Pingback: 2014 – Dec – Week 4 | kOyil
Pingback: 2014 – Dec – Week 5 | kOyil
Pingback: 2015 – Jan – Week 1 | kOyil
Pingback: srIvaishNava Portal (consolidated view) | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: తిరువరంగత్తు అముదనార్ | guruparamparai telugu
Pingback: 2015 – Mar – Week 1 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: 2015 – Mar – Week 2 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: 2015 – Mar – Week 3 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: 2015 – Apr – Week 2 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: 2015 – Apr – Week 3 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: 2015 – Apr – Week 4 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: 2015 – Apr – Week 5 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc
Pingback: తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ | guruparamparai telugu
Sir. I am having religious books viz SUNDARA KANDAM Ramayanam. Etc in Telugu more than 80 years old. If you are interested I will send the list for your information. I want to donate . Please inform me
Sreemate ramanujaya namaha.
దాసోహం స్వామి
అడియేన్. చాలా చక్కటి సమాచారం అందించారు స్వామి
విజయవాడ కు 7కి.మీ. దూరంలో, ఆంధ్రప్రదేశ్ సచివాలయం కు వెళ్ళే దారిలో భగవదాజ్ఞగా *శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రము* నిర్మాణం జరుగుతోంది. అచ్చట శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్థంబాల మీద ఆచార్య దివ్య మంగళ స్వరూపాలను చెక్కించి, వారి నామాలను ఉదాహరించిన, వారి జీవిత చరిత్ర పుస్తక ప్రసాదం గా భాగవతుల కు అందిచాలని చిరుసంకల్పం
ఆ స్థంబాలపై సుమారు 74మంది ఆచార్య దివ్య మంగళ స్వరూపాలను చెక్కించి వచ్చు.
తమరు, ఆచార్య దివ్య మంగళ స్వరూపాలు, చరిత్ర ఇవ్వగలందులకు అనేకానేక దాసోహములతో మంగళా శాసనాలు చేస్తూ…
దాసానుదాసుడు
రాంబాబు
98480 66464
arambabu162@gmail.com