అప్పిళ్ళార్ గొప్ప ఙ్ఞాని.వీరిని అప్పిళ్ళాన్ అని కూడా అంటారు.వీరు ఎంబెరుమానార్ శిష్యులైన కిడాంబి ఆచ్చాన్ పరంపరవారు.మనవాళమామునుల శిష్యులై అష్టదిగ్గజాలలో ఒకరయ్యారు
శ్రీరంగనాధుఙ్ఞ మేరకు మామునులు శ్రీరంగములో వేంచేసి మన సంప్రదాయ పరిమళాలను నాలుగుదిశల వ్యాపింపచేస్తున్న కాలంలో ఎందరో ఆచార్యపురుషులు వీరి ఉత్తరభారతంలోని ఎందరో పన్డితులను అవలీలగా గెలిచారు.ఆ గర్వంతో ఎరుమ్బి అప్పాతో వాదుకు వచ్చారు.కాని ఎరుమ్బి అప్పాను చూడగానే వారికి దాసోహమన్నారు. వారి దగ్గర కొత్త కొత్త అర్ధాలను తెలుసుకులున్నారు .కొంతకాలం తరవాత వారు శ్రీరంగనకుము బయలు దేరుతూ ఎరుమ్బి అప్పా ధగ్గరకు వెళ్ళి మామునులతో వాదుకు బయలుదేరుతున్నానని సెలవుతీసుకొరారు.అలా ఎప్పటికి చేయకండి.వారు మహా పండితులు.కాంచేపురములో కిడాంబి ఆచ్చాన్ దగ్గర శ్రీభాష్యము సేవించినవారు.ఆరోజులలో ఒకసారి కిడాంబి ఆచ్చాన్ మామునులను పాతపాఠాలలో .పరీక్షించమని కోరారు మామునుల అపారమైన ఙ్ఞాపక శక్తికి,ఙ్ఞానమునకు నేను ఆశ్చర్యపోయాను.వారు సన్యాసులందరికి నాయకులు.మన సంప్రదాయాన్ని పునరుజ్జీవింప చేస్తున్నారు. వారిని మనం గౌరవించాలి కాని వాదులాడరాదు. ముందు ముందు వారి గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలియజేస్తాను అన్నారు. ఇది విన్న అప్పిళ్ళార్ మామునుల గురించి ఓ మేరకు తెలుసుకొని ఎరుమ్బి అప్పా నుండి సెలవు తీసుకొని వెళ్ళారు.
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: 2014 – June – Week 3 | kOyil