శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ఎఱుమ్బి అప్పా – కాంచీపురము అప్పన్ స్వామి తిరుమాళిగై
తిరునక్షత్రము~: ఐప్పసి, రేవతి
అవతార స్తలము~: ఎఱుమ్బి
ఆచార్యులు~: అజగియ మణవాళ మామునిగళ్
శిశ్యులు~: పెరియవప్పా (వారి యొక్క కుమారులు), సేనాపతి ఆళ్వాన్
శ్రీసూక్తులు~: పూర్వ దినచర్యై, ఉత్తర దినచర్యై, వరవరముని శతకము, విలక్షణ మోక్ష అదికారి
నిర్ణయము,చివరి పాశురమైన ఉపదేశ రత్తిన మాలై (మన్నుయిర్గాళ్ …)
ఎరుమ్బి అప్పా మనవాళమామునుల శిష్యులైన అష్టదిగ్గజముఅలో ఒకరు.(అష్టదిగ్గజములు మనసంప్రదాయమును కాపాడినవారు.) వీరి అసలు పీరు దేవరాజన్.
వీరు తమ గ్రామములో నివశిస్తూ ధర్మాచరణ చేన్నప్పుడు మణవాళ మామునుల గురించి విన్నారు.మనవాళమామునుల కలామును మనపూర్వాచార్యులు ‘నల్లడిక్కాలమ్'(స్వర్ణ యుగము) గా భావించారు.ఈ కలాములోనిరాటంక;ముగ భగవద్గుణానుభవము పొందగలిగారు.ఉదహారణకు శ్రీమద్రామానుజుల కాలములో శైవరాజు కారణముగా శ్రీరంగమునుండి తిరునరాయాణపురము వెళ్ళవలసివచ్చింది. అలాగే భట్టరువారికాలంలో రాజు దురాగతాలవలన తిరుకోట్టియూరువెళ్ళవలసిన నిర్భందము ఏర్పడింది.పిళ్ళైలోకాచర్యుల కాలములో కూడా మహమ్మదీయుల దండయాత్రలవలన దక్షిణముగావీళ్ళారు.కాని మనవాళ మాములు శ్రీరంగము వచ్చిన తరవాత దేవాలయనిర్వహణను మెరుగుపరచి ఆచార్యపురుష సంప్రదాయాన్ని పునరుద్దరించారు.చెదరిపోయిన గ్రందాలను సేకరించారు.నిరంతరము ఆళ్వారుల గ్రంథముల కాలక్షేపములో కాలమును గడిపేవారు.
మణవాళ మామునుల గురించి విన్న ఎరుంబి అప్ప వారిని సేవించుకోవాలని శ్రీరంగము లోని మఠమునకు వచ్చారు.అప్పుడు వారు తిరువాయిమొళి లోని మొదటి పాశురము ‘ఉయర్వర ఉయర్నలమ్‘ వ్యాక్యానము చేస్తున్నారు. వేదము,వేదాంతము,పరత్వము గురుంచి మామునులు చేస్తున్న వ్యాక్యానము మనసుకు హత్తుకుపోయింది.తరవాత మనవాళమామునులు వీరిని తదీయారాదనకు ఆహ్వానించారు.కాని ఎరుంబిఅప్పా దానికి సమ్మతించలేదు.సన్యాసి మఠములోగాని,వారి ఉచ్చిష్ఠముగాని ,వారిచే పంపిచబడిన ఆహారముగాని స్వీకరించరాదనే సామాన్య ధర్మమును వీరు పాటించారు.ఒకవేళ అలా స్వీకరిస్తే వారు ‘చాందరాయణవ్రతమును ఆచరించవలసి వుంటుంది.వీరు విశేష ధర్మమును తెలుసుకొలేకపొయరు. అదేమంటే తిరుమాలై లోని 41వ పాశురములో ‘ తరువరేల్ పునిదమన్రే‘(మహానుభావులైన శ్రీవైష్ణవులు దయతో ఇచ్చిన ప్రసాదము పరమపవిత్రమైనది.దానినిభక్తితో స్వీకరించాలి.)

శ్రీ రామ పరివారము – అప్పా యొక్క తిరువారాదన పెరుమాళ్ (కాంచీపురములోని అప్పన్ స్వామి తిరుమాళిగైలో చూడవచ్చు)
వారు తిరిగి స్వగ్రామమునకు చేరుకొని,ఉదయము అనుష్టానమును పూర్తిచేసుకొని,వారు కోవిల్ ఆళ్వార్ (తిరువారాదనము చేయు గది) తెరుచుటకు ప్రయత్నించగా వారి యొక్క తిరువారాదన పెరుమాళ్ చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) తలుపును తెరుచుకోకుండా చేసిరి. భాదతో వారు అహారమును తీసుకోకుండా నిద్రకి ఉపక్రమించిరి.వారి యొక్క స్వప్నములో,మామునులు మరెవరో కాదు.ఆదిశేషుడు.రామావతారములో లక్షణుడు. దుఃఖితులైన సంసారులనుధ్ధరించుటకు ఈ యుగములో మామునులుగా అవతరించారు.వారినాశ్రయించి తత్వఙ్ఞానమును పొందండి’ అని శ్రీరాముడు చెప్పగా ఎరుంబిఅప్పా పరుగుపరుగున శ్రీరంగము చేరుకొని కోయిల్ కందాడై అన్నన్ పురుషకారముతో మామునుల శ్రీచరణాలను అశ్రయించారు తరువాతికాలములో మామునుల ముఖ్య శిష్యులైన అష్టదిగ్గజములలో ఒకరైనారు.
ఎరుంబిఅప్పా మామునులతో ఉన్న కాలములో వారి దినచర్యను పరిశీలిస్తూ శ్లోకములుగా చెప్పేవారు. తరువాతికాలములో అవి ‘దినచర్య’ గాప్రసిద్దిగాంచిది.
తమ గ్రామమునకు వచ్చినప్పటికి ఎరుంబిఅప్పా మామునుల గురించే చింతిస్తూ ఉండటము వలన వారి నిత్యానుష్ఠానమును ‘పూర్వ దినచర్య’,’ఉత్తరదినచర్య’గా కూర్చి ఆచార్యులకు ఒక శ్రీవైష్ణవులతో పంపించారు.అది చూసిన ఆచార్యులు ఎంతో పొంగిపోయి వెంటనే ఎరుంబిఅప్పాను రమ్మని ఆహ్వానము పంపించారు వీరు కూడా ఆచార్యుల ఆఙ్ఞను శిరసావహించి వచ్చి మామునులు నంపెరుమాళ్ సమక్షంలో చేస్తున్న భగవద్విషయ కాలక్షేపమును విని తరించి గ్రామమునకు తిరిగి వెళ్ళారు.
కొంతకాలనికి మామునుల పరమపద వార్త తెలుసుకొని అపారమైన వియోగబాధను పొంది వారి శ్రీసూక్తులను తలచుకుంటూ తమను కూడా వీలైనంత త్వరలో పరమాత్మ సన్నిధికి చేర్చుకొమ్మని ప్రార్థించారు.
ఎరుంబిఅప్పా తన శిష్యులైన సేనాపతి ఆళ్వాన్ మొదలైనవారితో సంభాషించిన సంప్రదాయ విషయములను ‘”విలక్షణ మోక్ష అదికారినిర్ణయము” అనె గ్రంధముగా సంపుటీకరించారు.
ఆళ్వార్,ఆచార్యుల శ్రీసూక్తులకు సంభందించిన అనేక అపార్థాలను నివృత్తి చేసుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది.సంసారములో వైరాగ్యము పెంచుకొని పూర్వాచార్యుల ఙ్ఞాన, అనుష్ఠానములయందు అభిమానమును పెంచుకొని వాటినిఆచరించాల్సిన అవసరాన్ని ఈగ్రంధము తెలియచేస్తుంది. పూర్వ,ఉత్తరదినచర్యలను అనుసంధానము చేయనివారు నిత్య ప్రసాదము స్వీకరించరాదని మన పూర్వాచార్యులు నిర్ణయించారు.అటువంటి ఎరుమ్బిఅప్పా దివ్యచరణములను నిత్యము స్మరించుకుందాము
ఎరుమ్బిఅప్పా తనియన్
సౌమ్య జామాతృ యోగీన్ద్ర చరణామ్భుజ షట్పదమ్
దేవరాజ గురుమ్ వన్దే దివ్య జ్నాన ప్రదమ్ శుభమ్
ஸௌம்ய ஜாமாத்ரு யோகீந்த்ர சரணாம்புஜ ஷட்பதம்
தேவராஜ குரும் வந்தே திவ்ய ஜ்ஞான ப்ரதம் சுபம்
అడియేన్ చుడామణి రామానుజదాసి
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: 2014 – June – Week 1 | kOyil
Pingback: కోయిల్ కన్దాడై అప్పన్ | guruparamparai telugu
Pingback: 2014 – Nov – Week 2 | kOyil
Pingback: ప్రతివాది భయంకరం అణ్ణన్ | guruparamparai telugu
Pingback: కోయిల్ కందాడై అణ్ణన్ | guruparamparai telugu
Pingback: dhEvarAja guru (eRumbi appA) | guruparamparai – AzhwArs/AchAryas Portal