శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
క్రిందటి సంచికలో అళగియ మణవాళ మామునిగళ్ గురించి తెలుసుకున్నాము . ఈరోజు వారికి ప్రాణ సుక్రుత్ అయిన వారైన శ్రీ వానమామలై జీయర్ స్వామి వారి గురించి తెలుసుకుందాం .

పొన్నడిక్కాల్ జీయర్ – వానమామలై

పొన్నడిక్కాల్ జీయర్ – తిరువల్లికేణి
తిరు నక్షత్రం : భాద్రపద మాసము, పునర్వసు నక్షత్రము
అవతారస్థలం : వానమామలై
ఆచార్యులు: అళగియ మణవాళ మామునిగళ్
శిష్యులు : చోలసింహపురం మహార్యర్(దొడ్డాచార్యర్), సమరభుంగవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, రామానుజం పిళ్ళై, పళ్ళక్కాయ్ సిద్ధర్, గోష్టి పురత్తైయర్ మరియు అప్పాచిఆరాణ్ణా మొదలగు వారు
పరమపదించిన ప్రదేశము : వానమామలై
శ్రీ సూక్తి గ్రంధములు : తిరుప్పావై స్వాపదేశ వ్యాఖ్యానము
అళగియ వరదర్ అను పేరుతో జన్మించి పొన్నడిక్కాల్ జీయర్ అను పేరుతో ప్రసిద్ధి పొందారు. వానమామలై జీయర్, వానాద్రి యోగి, రామానుజ జీయర్, రామానుజ ముని మొదలగు పేర్లతో వీరు కీర్తింపబడురు. వీరు అళగియ మణవాళ మామునిగళ్ వారికి మొట్ట మొదటి మరియు ముఖ్యమయిన శిష్యులు.
అళగియ మణవాళ మామునిగళ్ వారు గృహస్తుడిగ ఉన్నప్పుడు వారికి మొదటి శిష్యులయ్యిరి.అళగియ వరదర్లు వెంటనే సన్యాసాశ్రమమును స్వీకరించి వారి జీవితములో ఎక్కువ భాగము మాముణులతో ఉండేను.పొన్నడిక్కాల్ అనగా బంగారు పాదము. మొట్ట మొదటి శిష్యుడు అయి మామునిగళ్ శిష్య సంపదకు పునాది వేసినందుకు కారణముగా వీరిని పొన్నడిక్కాల్ అను పేరు తో పిలుచుదురు. వీరు ఎన్నో తొతాద్రి మఠములను భారత దేశము అంతటా స్ధాపించి మన సంప్రదాయమును ప్రచారం చేసారు.
మామునిగళ్ అప్పుడు మొదటిసారి తిరుమలై యాత్రను చేయదలచిరి, పెరియ కేళ్వి అప్పన్ జీయర్ ఒక స్వప్నమును చూసెను,అందులో ఒక గృహస్తర్ పడుకొని ఉండగా వారి పాద పద్మములయందు ఒక సన్న్యాసి నిలబడి ఉన్నారు. జీయర్ అక్కడి ప్రజలను వారిరువురు ఎవరు అని అడుగగా, వారు ఈ విధముగ చెప్పెను ఒకరు “ఈట్టు పెరుక్కర్” అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు ఇంకొకరు నాయనార్ స్వయంగా పొన్నడిక్కాల్ జీయర్ అని పిలిచే మహానుభావులు.
పొన్నడిక్కాల్ జీయర్ ఎంతో మంది ఆచార్యులను మామునిగాల్ వద్దకు చేరుటకు పురుషకారముగా ఉండెను. యతీన్ద్ర ప్రవణ ప్రభావములో ఎంతో మంది శ్రీవైష్ణవులు పొన్నడిక్కాల్ జీయర్ ద్వారా మామునిగళ్ళకు సంబంధమును పొందిరని మరియు వారిని కైంకర్యమును చేయుటకు సహాయపడిరని చూడగలము.
కన్దాడై అణ్ణన్ మరియు వారి యొక్క బంధువులు మామునిగళ్ కి శిశ్యులుగా చేరిన తదుపరి, మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ ను తన యొక్క ప్రాణ సుక్రుత్ అని వారికి తమ వలె ఘనత /గౌరవమ్ చెందాలని చెప్పిరి. అప్పాచిఆరణ్ణా మామునిగళ్ వద్ద్డకు శిశ్యుడిగా మారుటకు రాగా, మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ ను పిలచి,వారి ఆసనముపై కూర్చోబెట్టి, వారికి తమ ఒక్క శంఖము మరియు చక్రము ఇచ్చి అప్పాచిఆరాణ్ణాకి సమాశ్రయణమును అనుగ్రహించమని ఆదేశించిరి. పొన్నడిక్కాల్ జీయర్ మొదట వినయం తో నిరాకరించినప్పడికినీ,మామునిగళ్ళ కోరికను చూసి,సమాశ్రయణమును అప్పాచిఆరణ్ణాకు మరియు ఇతరులకు అనుగ్రహించిరి.అలానే మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ కు అష్ట దిగ్ గజన్గళ్ ని నియమించిరి (వారికి ఎనిమిది మంది శిష్యుల మాదిరి) – చోలసింహపురం మహార్యర్(దొడ్డాచార్యర్), సమరభున్గవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, రామానుజం పిళ్ళై, పళ్ళక్కాయ్ సిద్ధర్, గోష్టి పురత్తైయర్ మరియు అప్పాచిఆరాణ్ణా
ఒక్కప్పుడు మామునుగళ్ అప్పాచిఆరణ్ణాని శ్రీరంగమును వదిలి కాంచీపురమునకు వెళ్ళమని ఆదేశించిరి,అది విని వారు విచారపడిరి.ఆ సమయములో మామునిగళ్ అప్పాచిఆరణ్ణాను తన యొక్క పాత రామానుజన్ (మన సాంప్రదాయములో తీర్త సొమ్బుని రామానుజన్ అని అందురు)తీసుకొమ్మని అడిగిరి,అది చాలా కాలము పొన్నడిక్కాల్ జీయర్చే ఆరాదించబడినది.దానిని తమ యొక్క రెండు చిన్న అర్చా తిరుమేనిలను(మామునిగళ్)చేయమని,ఒకటి అప్పాచిఆరణ్ణా దగ్గర ఉంచుకొని మరొకటి వారి ఆచార్యులైన పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వమనిరి.
కొంతకాలము తరువాత దైవనాయకన్ ఎమ్పెరుమాన్ (వానమామలై)సేనై ముదలిఆర్ ద్వారా ఒక శ్రీముకమును (ఆదేశమును) మామునిగళ్కి , పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలై దివ్య దేశమునకు కైంకర్యములను చూసే నిమిత్తమై పంపమనిరి. మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలైకి వెళ్ళమని ఆదేశించగా అది శిరసావహించి వెళ్ళిరి. అప్పుడు మామునిగళ్ ప్రతీ ఒక్కరిని పెరియ పెరుమాళ్ళ ముందు 4000 దివ్య ప్రభన్దమును రోజు 100 పాశురములను క్రమముగా పఠించమనిరి.పెరియ తిరుమొళి సాత్తుమురై రోజున, “అణియార్ పొళిల్ శూళ్ అరన్గనగరప్పా” పాడుచుండగా, ఎమ్పెరుమాన్ చాలా సంతోషముచెంది, తన సన్నిది నుండి అరన్గనగరప్పన్ (లక్శ్మినారయణన్ విగ్రహమును) పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వగా,వారితో అది వానమామలైకి చేరినది. పెరియ పెరుమాళ్ ప్రత్యేక ప్రసాదమును మరియు శ్రీ శఠగోపమును పొన్నడిక్కాల్ జీయర్కి ఇచ్చి వీడుకోలును పలికిరి.అలానే మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ని తన మఠమునకు తీసుకువచ్చి, గొప్ప తదియారాదనను చేసి వారిని వానమామలైకి పంపిరి.
పొన్నడిక్కాల్ జీయర్ వానమామలైలో నివసించి,ఎన్నో కైంకర్యములను వానమామలై మరియు పక్కనే గల నవ తిరుపతి, తిరుక్కురున్గుడి మొదలగు దివ్యదేశములలో మరియు తను యాత్రలు చేసినప్పుడు బదిరీకాశ్రమములో చేసిరి.వారికి ఎంతో మంది శిష్యులు లభించిరి,వారికి కాలక్షేపములను అనుగ్రహించిరి మరియు కైంకర్యములను కొనసాగించమని ఆదేశించిరి.
పొన్నడిక్కాల్ జీయర్ ఉత్తర దివ్యదేశములను దర్శించుటకు పెద్ద యాత్రను చేపట్టిరి.ఆ సమయములో మామునిగళ్ సంసారములో తన లీలలను చాలించుకొని పరమపదమునకు చేరిరి.ఆ సమయములో వారు యాత్రలో తిరుగుప్రయణములో,తిరుమలైకి చేరగానే మామునిగళ్ పరమపదమునకు చేరదలచిరన్న వార్త వినిరి బాధతో తిరుమలైలో కొంచము కాలము నివసించిరి.వారు యాత్ర చేసినప్పుడు వచ్చిన మొత్తము ధనమును శ్రీరంగమునకు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి, జీయర్ నాయనార్ని (మామునిగళ్ పూర్వాశ్రమములో మనవడు) మరియు ఇతర శ్రీవైష్ణవులతో కలసి వారి యొక్క ఆచార్యుల ఎడబాటును గురించి బాధపడిరి.ఆ సమయములో,మామునిగళ్ ఆఙ్ఞ ప్రకారము, మామునిగళ్ యొక్క ఉపదణ్డమ్ (మరొక దణ్డమ్),ఉంగరము (తిర్వాజి మోదిరమ్) మరియు పాదుకాలను పొన్నడిక్కాల్ జీయర్కి ఇచ్చిరి. ఇప్పడికినీ ఆ ఉపదణ్డమును వానమామలై జీయరుల త్రిదణ్డములో కట్టుతారు.ఆ విధముగానే, ఈ రోజుకూడా వానమామలై జీయర్లు మామునిగళ్ యొక్క ఉంగరమును ప్రత్యేక సందర్బములలో ధరిస్తారు. వారు తిరిగి వానమామలైకి చేరి తన కైంకర్యమును యదావిధిగా చేసిరి.
ఆ సమయములో,వానమామలైలోని శ్రీవరమన్గై నాచ్చియార్కి ఉత్సవ విగ్రహము లేదు.ఒకసారి పొన్నడిక్కాల్ జీయరుల స్వప్నములో దైవనాయకన్ ఎమ్పెరుమాన్ కనిపించి నాచ్చియార్ తిరుమేనిను (విగ్రహము)తిరుమలై నుండి తీసుకురమ్మని ఆదేశించిరి.అందువలన,వారు ఎమ్పెరుమాన్ యొక్క ఆఙ్ఞను నెరవేర్చుటకై తిరుమలైకి బయలుదేరిరి. వారి కలలో, నాచ్చియార్ కనిపించి ఈ విధముగా చెప్పెను“ప్రియమైన తండ్రీ,వానమామలైకి తీసుకువచ్చి దైవనాయకన్ ఎమ్పెరుమాన్ తో తిరుకళ్యాణము జరిపించుము”. ఆ విధముగానే ఆమె తిరుమలై జీయర్ స్వామికి తన విగ్రహమును పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వవలసినదిగా ఆదేశించెను.జీయర్ వారి ఆఙ్ఞను అనుగుణముగా నాచ్చియార్ను పొన్నడిక్కాల్ జీయర్తో పంపిరి. పొన్నడిక్కాల్ జీయర్ వారిని వానమామలైకి తీసుకువచ్చి, గొప్పగా తిరుకళ్యాణముకు ఏర్పాటులు చేసి స్వయముగా వారే కన్నికాదానమును చేసిరి. దైవనాయకన్ ఈ విధముగా చెప్పిరి “పెరియాళ్వార్ వలె, పొన్నడిక్కాల్ జీయర్ కూడా మాకు మామగారు” ఇప్పడికీని ఈ సాంప్రదాయము వానమామలై దివ్యక్షేత్రములో ఉన్నది.
తదుపరి చాలా సంవత్సరములు జీవించి విలువైన ఉపదేశములను ప్రతీఒక్కరికిని అందించి, పొన్నడిక్కాల్ జీయర్ తమ ఆచార్యులైన అళగియ మణవాళ మామునిగళ్ని ధ్యానిస్తూ తమ యొక్క చరమ తిరుమేని వదిలి పరమపదమును చేరిరి. వారు తదుపరి జీయరుని వానమామలై మఠమునకు నియమించిరి,ఇప్పడికినీ ఈ ఆచార్య పరమ్పర నడుచుచున్నది. మనకూ ఎమ్పెరుమానార్ మరియు మన ఆచార్యులతో అటువంటి అనుబంధము కలిగేలా పొన్నడిక్కాల్ జీయర్ శ్రీ చరణములను ఆశ్రయించుదాము.
పొన్నడిక్కాల్ జీయర్ తనియన్ (దొడ్డాచార్యర్ సమర్పించిరి)
రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖా మయమ్ సదా
తతా యత్తాత్మ సత్తాదిమ్ రామానుజ మునిమ్ భజే
ரம்ய ஜாமாத்ரு யோகீந்த்ர பாதரேகா மயம் ஸதா
ததா யத்தாத்ம ஸத்தாதிம் ராமானுஜ முநிம் பஜே
దొడ్డాచార్యర్ పొన్నడిక్కాల్ జీయర్ వైభవమును గురించి సంస్కృతము వ్రాసిన కొన్నింటిని క్రింద చూద్దాము.ఈ రెండు రచనలు పొన్నడిక్కాల్ జీయరుల గొప్పతనమును చాలా అద్భుతముగా వర్ణించెరి.దొడ్డాచార్యుల అసలు ప్రతిని తమిళములో సులభ అనువాదమును శ్రీ ఉ.వే. తెన్ తిరుప్పేరై అరవిన్దలోచనన్ స్వామి వ్రాసెను (http://www.kaarimaaran.com/downloads/PrapathiMangalasasanam.pdf).
వానమామలై జీయర్ మంగళాశాసనము:
- అజగియ వరదర్ అనే నామముతో తెలియబడి, జన్మతహ వచ్చిన మంచి గుణములతో,శుద్దమైన ఆత్మతో,సముద్రము అంతటి కరుణని కలిగి,మామునిగళ్ యొక్క కరుణని కలిగిన వానమామలై జీయరుని నేను ఆరాదించుదును.
- మన సాంప్రదాయమునకు మరియు అందరు జీయర్ స్వాములకు నాయకుడిగా ఉండి,మామునిగళ్ యొక్క అన్ని గొప్ప గుణములను కలిగిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
- ఎల్లప్పుడూ మామునిగళ్ శ్రీ చరణముల వద్ద తుమ్మెద వలె ఉండి,నా మనసుని నిండు చంద్రుడివలె సంతోషముగా ఉంచిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
- మామునిగళ్ తన జీవిత శ్వాసగా భావించే మరియు వాత్సల్యము, శీలము,ఙ్ఞానము వంటి మంచి గుణములను కలిగిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
- మిగిలిన రెండు ఆశ్రమములను వదిలి(గృహస్తాశ్రమము మరియు వానప్రస్తమము)నేరుగా బ్రహ్మచర్యము నుండి సన్న్యాసమును స్వీకరించిన వానమామలై జీయరును నేను ఆరాదించుందును.
- మామునిగళ్ళచే మొదటగా అనుగ్రహముపొంది మన కామము(దురాశ)మొదలగు దోషములను(లోపాలను) నిర్మూలించే వానమామలై జీయరును నేను ఆరాదించుందును.
- అన్ని సద్గుణములు కలిగి ఉండి , లౌకిక విషయములో ఇష్ట అనిష్ట్ ములు లేకుండ ఉండు మరియు తామర పుష్పముల వంటి కన్నులు కలిగి ఉండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను .
-
వైరాగ్యం మొదట హనుమాన్ లో మొదలైనది అటు పిమట భీష్మ పితమహా లో అభివృద్ది చెందింది . ఇప్పుడు వానమామలై జీయర్ స్వామి లో ప్రకాశించునది . అటువంటి కీర్తిని గడించిన స్వామిని చూచుట బహు ఆనందముగా నుండును .
- ఎవరి ఉభయవేదంతముల వివరణముల మహా పండితులను అయినను ఆకర్షించునో, ఎవరి అనుష్టానము దృష్టాంతము ను గొని సన్యాసులు సైతము ఆచరణ చేయుదురో , మచ్చ లేని వారు మరియు జ్ఞానము ,సద్గుణముల భాండాగారము అయిన వారు ఎవ్వరో , మరియు ఎవరియితే మణవాళ మామునులను ఆశ్రయించిరొ ,అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
- ఎవరి కాలక్షేప గోష్టి లో పక్షులు సైతము “శ్రీ మన్నారయణుడె పరాత్పరుడని , వారే శుద్ధ సత్వమని , ఇతర దేవతలందరూ వారికి పరిచారకులని ” కూవుదురో , అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
-
ఎవరి కటాక్షము యొక్క శక్తి వలన అర్థ పంచక జ్ఞానము సులువుగా స్ఫురించునో , ఎవరి శిష్యులకు కల్ప వృక్షము వంటి వారో మరియు ఎవరైతే వానమామలై లో పెక్కు కైంకర్యములు చేసిరో , అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
- ఎవరైతే వారి నిశ్చలమైన కరుణ తో నన్ను ఉద్ధరించిరో ( భౌతిక విషయములందే ఆశ ఉండు శ్రీ వైష్ణవ సిద్ధాంతములో ఆశక్తి లేని వాడైన నేను ) మరియు వానమామలై దివ్య క్షేత్రమునకు ఐశ్వర్యము వంటి వారైనా వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
-
జ్ఞాన వైరాగ్యములు సంపూర్ణముగా కలిగి ,ఒక బంగారు ఆభరణముల పెట్టి వలె నుండి , ఎమ్పెరుమానర్ల చే స్థాపించబడిన ఆచార్య పీఠము తీసుకొనుటకు సంసిద్ధముగా నుండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
- మణవాళ మామునుల కరుణ కు పాత్రమై , జ్ఞానము మొదలగు సద్గుణముల సముద్రమై ,దైవనాయక ఎమ్పెరుమాన్ మీద విడదీయరాని ప్రేమ కలిగిన వారై ఉండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను
వానమామలై జీయర్ స్వామి ప్రపత్తి:
1.అప్పుడే విరిసిన తామర పూవ్వు వలె అందముగా నుండు వారున్నూ , సేవించిన వారికి ఆనందము కలిగించు వారున్నూ ,సంసారము అనే దుఃఖ సాగరములో మనలను సహాయము చేయు వారు అయిన వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను
2. దోషములను నివారించు వారున్నూ , సద్గుణముల సముద్రమున్నూ , శిష్యులకు కల్ప వృక్షము అయినటువంటి వారైనా మణవాళ మామునిగళ్ యొక్క ఆశీర్వాదము చే ప్రఖ్యాతి ని పొందినట్టువంటి వారైనా వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను
3. మణవాళ మామునిగళ్ ని ఆశ్రయించిన వారై , సంసార సంబంధమును పెంపొందించు నని దాంపత్య జీవితమున చిక్కుకొనని వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను
4. విరక్తి అనే లతా హనుమానతాళ్వాన్ నుండి మొదలై ఇప్పుడు వానమామలై జీయర్ వరకు పూర్తిగా వ్యాపించి పరిమళించు చున్నది , అటువంటి వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను .
5. ఏ విధంగా ఆదిశేషుడు ఎమ్పెరుమాన్ యొక్క ప్రీతి కాగా కైంకర్యములు చేసెదరో ఆ విధంగానే తమ ఆచార్యులైన మణవాళ మామునిగళ్ యొక్క ప్రీతి కాగా వానమామలై లో కైంకర్యములు( మండపములు కట్టించుట మొదలగునవి ) చేసిన వానమామలై జీయర్ స్వామి ని నేను ఆశ్రయించెదను.
6. నమ్మాళ్వార్ల చే అనుగ్రహింపబడ్డ లోతైన వేదాంత అర్థములను విశేషంగా విశదపరిచిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
7. వానమామలై జీయర్ స్వామి యొక్క నామము పలికినంత మాత్రమున సంసారము అనే పాము యొక్క విషము నుండి విమోచనము ను పొంది ఎమ్పెరుమాన్ తో సమముగా జీవత్మాలను ఉజ్జించజేయును. అటువంటి వారి శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
8. అనాది కాలము నుండి కుడబెట్టుకొన్న పాపములను విముక్తి ని ఇచ్చే , సాధువుల చే పూజింపబడే , స్వచ్చముగా నుండు వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
9. వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద తీర్థమును ఎవరినైను పవిత్రము చేసి తాపత్రయము ను వెంటనే తొలగించును . అటువంటి వారి శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
10. నిర్మలమైన మరియు సద్గుణముల సాగరము అయినటువంటి అప్పాచియారణ్ణ ఆశ్రయించిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
11. సద్గుణముల శిఖరమై, సాధువుల చే పూజింపబడే సమరభున్గావచార్యర్ ఆశ్రయించిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
12. వానమామలై జీయర్ స్వామి కి సాటి సమముగా ఎవరు లేరు . వారి వైరాగ్యము హనుమాన్ , భీష్ముడు మొదలగు వారి కన్నను ఎక్కువ . ఒరాణ్ వళి గురుపరంపరై లో నమ్మాళ్వార్ మొదలగు వారి భక్తి కి సమముగా ఉన్నది. వారి జ్ఞానము నాథమునుల , ఆళవన్దార్ మొదలగు వారి తో సమము . వీటనింటిని పరిశీలించిన పిదప వానమామలై జీయర్ స్వామి కన్నా గొప్పవారు ఎవ్వరైనను ఉందురో ?
13. దైవనాయకన్ ఎమ్పెరుమాన్ ను ఆదిశేషుని వలె సేవించిరి. కులశేఖర్ ఆళ్వార్ మాదిరిగా ఎమ్పెరుమాన్ యొక్క భక్తులను కొని యాడిరి, నమ్మాళ్వార్ ను మధుర కవి ఆళ్వార్ సేవించిన విధముగా వారి ఆచార్యులైన మణవాళ మాముని సేవించిరి,పూర్వాచార్యుల యొక్క అడుగుజాడల లో అనుసరించిరి , మంచి గుణముల భాండాగారము గా ఉండిరి.
14.పూర్వము ఎమ్పెరుమాన్ నారాయణ,నరు లుగా అవతారము ఎత్తినారు . ఇప్పుడు ఎమ్పెరుమాన్ మణవాళ మాముని మరియు వానమామలై జీయర్ స్వామి గా అవతరించిరి.వానమామలై జీయర్ స్వామి యొక్క కీర్తి ఇంత గొప్పది.
మనము తదుపరి సంచికలో తిరిగి గురు పరంపరలోని ఇతర ఆచార్యుల వైభవమును తెలుసుకుందాము.
రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ
అడియేన్ .!
రఘు వంశీ రామానుజదాసన్
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: ముదలాళ్వార్గళ్ | guruparamparai telugu
Pingback: appiLLai – అప్పిళ్ళై | guruparamparai telugu
Pingback: అప్పిళ్ళార్ | guruparamparai telugu
Pingback: శ్రీ పెరుమ్బుదూర్ ఆది యతిరాజ జీయర్ | guruparamparai telugu
Pingback: అప్పాచియారణ్ణ | guruparamparai telugu
Pingback: 2014 – Oct – Week 3 | kOyil
Pingback: ప్రతివాది భయంకరం అణ్ణన్ | guruparamparai telugu
Pingback: కోయిల్ కందాడై అణ్ణన్ | guruparamparai telugu