కూరత్తాళ్వాన్

శ్రీః
శ్రీమతే శఠగోపాయ నమ
శ్రీమతే రామానుజాయ నమ
శ్రీమద్ వరవరమునయే నమ
శ్రీ వానాచల మహామునయే నమ

kurathazhwan

తిరునక్షత్రము : మాఘ మాసము, హస్త

అవతార స్తలము : కూరము

ఆచార్యులు : ఎమ్పెరుమానార్

శిశ్యులు : తిరువరంగ అముదనార్

పరమపదము చేరిన ప్రదేశము : శ్రీరంగము

శ్రీ సూక్తులు : పంచ స్తవములు (అతి మానుష స్తవము, శ్రీ వైకుంఠ స్తవము, సుందర బాహు  స్తవము, వరదరాజ స్తవము, శ్రీ స్తవము), యో నిత్యమచ్యుత / లక్ష్మీ నాథ తనియన్లు.

  • కూరము అనే గ్రామములో ఒక సంస్థానాధిపతుల కుటుంబములో 1010 CE సంవత్సరములో (సౌమ్య నామ సంవత్సరము, మాఘ మాసము, హస్త నక్షత్రము) కూరత్తాళ్వర్ మరియు పెరుందేవి అమ్మాళ్ లకు జన్మించిరి. శ్రీవత్సాంగన్ అను నామదేయమును పెట్టిరి.
  • వీరి తల్లి గారు చిన్న వయసులో ఆచార్యుల తిరువడి చేరడము వలన వారి యొక్క తండ్రి గారు మరలా వివాహమును చేసుకొనలేదు, శాస్త్రములులో చెప్పి ఉన్నాకూడా ఆశ్రమములను అనుసరించి (ఏలననగా ఒకసారి వివాహము జరిగినప్పుడు, ఒక వేళ భార్య చనిపోతే, ఆ వ్యక్తి మరలా వివాహమును చేసుకొనవచ్చును). వారి యొక్క తండ్రిగారు ఈ విదముగా చెప్పిరి “నేను మళ్ళి వివాహము చేసుకొన్నచో నా యొక్క నూతన అర్థాంగి కూరతాళ్వాన్ ను సరిగా చూసుకొన నట్లైతే, అది భాగవత అపచారము” అవుతుంది. అది వారి యొక్క గొప్ప గుణము ఆ యొక్క చిన్న వయసులో.
  • వీరు దేవ పెరుమాళ్ సేవచేస్తున్న తిరుక్కచ్చి నంబి ఆఙ్ఞలను పాఠించేవారు.
  • వీరికి ఆండాళ్తో వివాహము జరిగినది, తను మంచి గుణములలో వీరికి సరిసమానమైనది.
  • వీరి ఎమ్పెరుమానార్ ఆశ్రయించి పంచ సంస్కారములను వారి వద్ద పొందినారు.
  • వారి యొక్క సంపదను అంతా కూరములో వదిలి, ధర్మ పత్నితో కూడి శ్రీరంగమునకు చేరి అక్కడ బిక్షను చేస్తూ నివసించారు.
  • వీరు ఎమ్పెరుమానార్తో కూడి కాశ్మీరునకు వెళ్ళి భొదాయన వృతి గ్రంథమును తేవడములో సహాయపడిరి. ఆ గ్రంథమును తిరుగు ప్రయాణములో పోవడమువలన, పూర్తి గ్రంథము తమకు గుర్తుకు ఉన్నదని ఎమ్పెరుమానార్ కి దైర్యము చెప్పిరి. తదుపరి, శ్రీరంగమునకు చేరుకొన్న పిదప, వీరు ఎమ్పెరుమానార్ యొక్క మహత్తరమైన “శ్రీ భాష్యము” ను తాళా పత్ర గ్రంథములో ఎమ్పెరుమానార్ చెప్పినది వ్రాయుటకు తోడ్పడిరి.

amudhanar-azhwan-emperumanar

తిరువరంగ అముదనార్  కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమానార్

  • వీరు ఎల్లప్పుడూ తిరువరంగత్తు అముదనార్లను ఎమ్పెరుమానారుల శిశ్యులగా ఉండమని ఆదేశించేవారు, అలానే ఆలయము యొక్క నిర్వహణ భాద్యతలను ఎమ్పెరుమానార్కి అప్పగించవలెనని చెప్పేవారు.
  • వీరు శైవ రాజు యొక్క న్యాయ స్థానమునకు ఎమ్పెరుమానారుగా వెళ్ళీ, రాజు ఆదేశించిన విదముగా “రుద్రుడే అదిదేవుడు” అనుటను ఖండించి,  శ్రీమన్ నారాయణుడే పరతత్త్వము అని చెప్పి వారి యొక్క దర్శనము (నేత్రములు) ఇచ్చి శ్రీవైష్ణవ దర్శనము (సాంప్రాదాయము) ను రక్షించిరి.
  • వీరు శ్రీరంగమును వదిలి తిరుమాలిరుంచోలైకి వెళ్ళి (ఎమ్పెరుమానార్ తిరు నారాయణపురము / మేల్కోటె వెళ్ళిన తరువాత) అక్కడ 12 సంవత్సరములు నివశించిరి.
  • వీరు సుందర బాహు స్తవమును (పంచ స్తవములలో ఒకటి)  కళ్ళజగర్ (తిరుమాలిరున్చోలై ఎమ్పెరుమాన్) విషయమున పాడిరి.
  • ఎమ్పెరుమానార్  శ్రీ రంగమునకు తిరిగి వచ్చినారని తెలిసి వీరు కూడా శ్రీరంగమునకు తిరిగి వచ్చిరి.
  • ఎమ్పెరుమానార్ ఆఙ్ఞతో, వీరు వరదరాజ స్తవమును దేవ పెరుమాళ్  విషయమున పడి,చివరన తన యొక్క సంభందులందిరికీ మోక్షమును ప్రసాదించమని అడిగిరి –ముఖ్యముగా నాలురాన్ విషయమై (వీరి కారణముగా తమ యొక్క నేత్రములు పోయెను).
  • మొత్తము వీరు పంచ స్తవములను పాడిరి – శ్రీ వైకుంఠ స్తవము, అతిమానుష స్తవము, సుందర బాహు స్తవము, వరదరాజ స్తవము మరియు శ్రీ స్తవము – అన్నీ వేదాంతము యొక్క సారమును కలిగి ఉండినవి.
  • వీరు ఎమ్పెరుమానారుల ఆదేశముచే పౌరాణిక కైంకర్యమును శ్రీరంగము ఆలయమందు చేయుటకు నియమించబడిరి మరియు అలానే మన సాంప్రాదాయ గ్రంథ నిర్వాహణమును కూడా తమ యొక్క కాలములో చేసిరి.

azhwan_bhattars

కూరత్తాళ్వాన్ మరియు  పరాశర భట్టర్  వేద వ్యాస భట్టర్

  • వీరు మరియు వీరి యొక్క దర్మపత్ని శ్రీ రంగనాధుని ప్రసాదము వలన ,ఇద్దరు అందమైన కుమారులు కలిగిరి. వారికి పరాశర భట్టర్ మరియు వేద వ్యాస భట్టర్ అని నామ కరణము చేసిరి.
  • వీరు అరుళిచ్చెయల్ అనుభవములో (4000 దివ్య ప్రభందము)మునిగి వారు ఎప్పుడైతే ఉపన్యాసము చెప్పుటకు ఉపక్రమించుదురో ఆ అనుభవము వలన ఏడుస్తూ ఉండేవారు.
  • పెరియ పెరుమాళ్ వీరిని నేరుగా ఐక్యము చేసుకొనిరి.
  • చివరగా, వీరు పెరియ పెరుమాళ్ళను మోక్షమును ప్రసాదించమని అడుగగా పెరియ పెరుమాళ్ అనుగ్రహించిరి. అప్పుడు ఎమ్పెరుమానార్ ఈ విధముగా అడిగిరి “నా కన్నా మొదలు మీరు ఎలా వెల్లుదురు?”, వారు ఈ విధముగా చెప్పెను “తిరువాయ్మొళి శూళ్ విశుమ్బణి ముగిల్… పదిగములో చెప్పినట్టుగా, ఎవరైతే పరమపదమును చేరుదురో, నిత్యులు మరియు ముక్తులు వచ్చి నూతనముగా వచ్చి నటువంటి ముక్త ఆత్మ యొక్క పాదములు కడుగుదురు. నేను మీతో నా కొరకై ఎలా ఈ పనిని చేయుంచుకొనుదును? అందువలన నేను ముందు వెళ్ళుతున్నానని చెప్పిరి.”
  • ఎన్నో ఐదీహ్యములు (సంఘటనలు), వ్యాఖ్యానములు మరియు గురు పరంపర ప్రభావములలో కూరత్తాళ్వాన్ యొక్క వైభవములను వీశదీకరించినవి. వారి యొక్క వైభవమును ఒక పేజిలో చెప్పడము సాద్యము కానిది? కూరతాళ్వాన్ వైభవమును ఇంతటితో ముగించడము నా యొక్క అశక్తతని తెలియచేయును, వారి యొక్క వైభవము అంతులేనిది.

ఆళ్వాన్ యొక్క తనియన్

శ్రీవత్స చిహ్న మిశ్రేబ్యో నమ ఉక్తి మదీమహే~:
యదుక్తయ స్త్రయి కంఠే యాన్తి మంగళ సూత్రదామ:

నేను కూరత్తాళ్వాన్ ను ఆరాదించుదును, వారి యొక్క పంచ స్తవములు వేదములకు మంగళ సూత్రములవంటివి (తిరుమాంగళ్యము) – ఏలననగా, అవి లేనిచో ఎవరు పరదేవత అనునది స్పష్టముగా చెప్పలేరు.

ఆళ్వాన్ యొక్క గొప్ప గుణములు (తిరువల్లిక్కేణిలో ఆళ్వాన్ యొక్క 1000 తిరు నక్షత్రము సందర్భముగా శ్రీ ఊ. వే. వేళుక్కుడి క్రిష్ణన్ స్వామి అనుగ్రహ భాషనము ఆధరముగా –http://koorathazhwan1000.webs.com/)

అర్వాన్చో యత్ పద సరసిజ ద్వన్ద్వమ్ ఆశ్రిత్య పూర్వే
మూర్ద్నా యస్యాన్వయమ్ ఉపగతా దేశికా ముక్తిమాపుః
సోయమ్ రామనుజ మునిర్ అపి స్వీయ ముక్తిమ్ కరస్తామ్
యత్ సమ్భన్దాద్ అమనుత కతమ్ వర్నయతే కూరనాధః

ఏ విదముగా హద్దులు లేని కూరతాళ్వాన్ యొక్క గొప్పతనమును పదములతో చెప్ప గలము (మొళియై కడక్కుమ్ పెరుమ్పుగలాన్ /వాచ మగోచర)? ప్రతీఒక్కరు ఎమ్పెరుమానార్ ద్వారా మోక్షమును పొందుదురు – కొందరు (ఎమ్పెరుమానార్ కన్నా వయసులో పెద్దవారు) వారి యొక్క తిరుముడి సంబంధము మరియు ఇంకొంత మందికి (ఎమ్పెరుమానార్ కన్నా చిన్నవారికి) తిరువడి సంబంధము వలన. అటువంటి గొప్ప గుణమును కలిగిన ఎమ్పెరుమానార్ కూడా కూరత్తాళ్వాన్ యొక్క సంబంధము వలన మోక్షమును పొందినామని చెప్పిరి.

కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమానార్ యొక్క ముఖ్యమైన శిశ్యులలో ఒకరు. కాంచీపురము సమీపములో కూరము అను గ్రామములో ఒక సంస్థానాదీశుల కుటుంబములో జన్మించిరి, కూరత్తాళ్వాన్ ను శ్రీవైష్ణవ ఆచార్యులలో ఒక సారాంశముగా పరిగణించుదురు. వీరు 3 మతములను కలిగి ఉండరని చెప్పుదురు – గర్వములు (విద్యా మతము – గొప్ప ఙ్ఞానమును కలిగిన గర్వము, దన మతము – అంతులేని సంపద కలిగిన గర్వము, అబిజాత్య మతము – గొప్ప కుటుంభము యొక్క వారసత్వమును కలిగిన గర్వము). వీరిని తిరువరంగత్తు అముదనార్ రామానుజ నూత్తంతాదిలో ఈ విదముగా కీర్తించిరి “మొళియై కడక్కుమ్ పెరుమ్ పుగజాన్ వంజ ముక్ కురుమ్బామ్ కుజియై కడక్కుమ్ నమ్ కూరత్తాళ్వాన్” మరియు మనవాళ మాముణులు యతిరాజ వింశతిలో “వాచామ గోచర మహాగుణ దేశికాగ్ర్య కూరాధినాధ” – రెండునూ కూరత్తాళ్వాన్ యొక్క వైభవమును అంతులేనిదిగా సూచించును. నిజముగా రామానుజ నూత్తందాది మరియు యతిరాజ వింశతి రెండూ కూడ ఎమ్పెరుమానార్ ను కీర్తించుటకూ పాడినవి.

ఎమ్పెరుమానార్ శ్రీవైష్ణవ సంప్రాదాయములో ముఖ్యముగా పరిగణించుదురు. ఈ సంప్రాదాయము నిజముగా సనాతన ధర్మమును తెలియజేయును (వేద మతము) ఇది తత్త్వ త్రయము యొక్క పరిమితి లేని ఙ్ఞానమును కలిగిఉండును (చిత్ – ఆత్మ, అచిత్ – విషయము మరియు ఈశ్వర – శ్రియః పతి శ్రీమన్ నారాయణుడు). ఎమ్పెరుమానార్ భారత దేశము మొత్తము ఈ ధర్మమును గురించి చాటి చెప్పెను. వీరికి ఒక లక్ష్యమును కలిగి ఉండడముచే ఎన్నో పాత్రలను నిర్వర్తించెను – బోదకుడిగా, ఆలయ నిర్వహణదికారిగా, సామాజిక ఉద్దారకుడిగా , మొదలైన. వీరు తొమ్మిది గ్రంథములను వ్రాసిరి, అవి వేదము, వేదాంతము, భగవత్ గీతా, శరణాగతి (భగవంతుడికి పూర్తిగా దాసోహము సమర్పించుట) మరియు వైదిక అనుష్టానముల యొక్క వివిద కోణములను చూపును.

ఎమ్పెరుమానార్ కు శ్రీ పార్థ సారధి స్వామి గుడికి దగ్గరి సంభదము కలదు, కారణము వారి తండి గారు తిరువల్లికేణి మూలవర్లు అయిన శ్రీ వేంకటక్రిష్ణన్ / శ్రీ పార్థసారది స్వామిని పూజించడము వలన, ఎమ్పెరుమానార్ ఈ యొక్క ప్రపంచములో అవతరించిరి. ఇది 108 దివ్య దేశములలో ఒకటి, ఇక్కడ పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనమును చేసిరి.

గీతాచార్యులు మరియు ఆళ్వాన్ 1

శ్రీ పార్థ సారధి, అతడే గీతాచార్యుడు – శ్రీ భగవత్ గీతను అర్జునుడికి ఉపదేశించెను. శ్రీ భగవత్ గీత సనాతన ధర్మునందు ముఖ్యముగా పరిగణించుదురు మరీ ముఖ్యముగా శ్రీవైష్ణవులకి నేరుగా కృష్ణుడు చెప్పడము చేట.

శ్రీ భగవత్ గీత 13వ అద్యాయములో, కృష్ణుడు క్షేత్ర (శరీరము) మరియు క్షేత్రఙ్ఞ (శరీరమును గురించి తెలిసిన వాడు – ఆత్మ) మద్య గల భేదములను గురించి వివరించెను. వారి సూచించిన విదముగా, దైవమును గురించి తెలిసిన వ్యక్తి 20 ముఖ్యమైన గుణములను కలిగి ఉండవలెను. ఈ గొప్ప గుణములన్నీ అద్భుతముగా కూరత్తాళ్వాన్ల జీవితములో చూడవచ్చు. మనమూ ఆ యొక్క గొప్ప గుణములను కణ్ణన్ ఎమ్పెరుమాన్ చెప్పిన విదముగా ఉదహారణలతో కూరత్తళ్వాన్ యొక్క జీవిత చరిత్రమును చూద్దాము.

శ్రీ భగవత్గీత, అధ్యాయము 13, శ్లోకములు 7 – 11

అమానిత్వమ్ అదంమ్భిత్వమ్
అహింసా క్షాంతిర్ ఆర్జవమ్
ఆచార్యోపాసనమ్ శౌచమ్
స్థైర్యమ్ ఆత్మ-వినిగ్రహః

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్
అనహంకార ఏవ చ
జన్మ మృత్యు జరా వ్యాధి
దుఖః దోషానుదర్షనం

అసక్తిర్ అనభిష్వంగః
పుత్ర దార గృహాదిషు
నిత్యం చ సమ చిత్తత్వమ్
ఇష్టానిష్టోపపత్తిషు

మయి చానన్య యోగేన
భక్తిర్ అవ్యభిచారిణీ
వివిక్త దేశ సేవిత్వమ్
అరతిర్జన సంసది

అధ్యాత్మ ఙ్ఞ్యాన నిత్యత్వం
తత్త్వ ఙ్ఞానార్త దర్శనమ్
ఏతత్ ఙ్ఞానం ఇతి ప్రోక్తమ్
అఙ్ఞానం యదతో న్యథా

1. అమానిత్వము – నమ్రతను కలిగి ఉండడము

  • గొప్ప సంస్థానాధీశుల మరియు సంపదను కలిగిన కుటుంబములో జన్మించినా, ఎమ్పెరుమానార్ కు సేవను చేద్దామని శ్రీరంగమునకు వెల్లేటప్పుడు మొత్తమూ సంపదనూ దానము చేసిరి.
  • శ్రీరంగములో, ఒక సమయములో, అప్పుడు ఎమ్పెరుమానార్ శ్రీ పెరియ నంబి గారిని పవిత్రమైన ఇసుకను ఆలయము ఉపద్రవముల నుండి కాపాడుటకు చూట్టూ గుండ్రముగా చల్లమని చెప్పిరి, శ్రీ పెరియ నంబి గారు ఒకరి సహాయమును కోరిరి – కాని ఆ వ్యక్తి చాలా విదేయుడై ఉండవలెనని చెప్పిరి – ఒక నిమిషము కూడ నేను ఎందుకు వేరొకరి వెనుక నడవాలి అనుకొకకూడదు. అప్పుడు ఎమ్పెరుమానార్ ఆలోచించి చూట్టూ చూస్తూ ఉండగా, శ్రీ పెరియ నంబి గారు స్వయముగా చెప్పిరి, “కూరత్తాళ్వనులను మాతో పంపండి కారణము అతడిని మించి వేరెవరు విదేయులు లేరు”.

2. అదంభిత్వము – గర్వమును కలిగి ఉండక పోవడము

  • అప్పుడు శ్రీ రామానుజులతో కూడి కాశ్మీరునకు భోదాయన వృత్తి గ్రంథమును (బ్రహ్మ సూత్రములకు చిన్న వ్యాఖ్యానము) తెచ్చుటకు వెళ్ళినప్పుడు,గ్రంథమును తీసుకొని తిరిగి ప్రయాణమయ్యిరి. ఆ సమయములో, కొందరు స్థానికులు ఎమ్పెరుమానార్ వారికి నచ్చక కొందరు దొంగలని ఆ యొక్క గ్రంథమును తిరిగి ఎమ్పెరుమానార్ వద్దనుండి తీసుకురమ్మని పంపిరి.దానికి ఎమ్పెరుమానార్ ఆ యొక్క వంచనకు నిచ్చేశ్టులు కాగా, కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమానార్ తో ఈ విదముగా చెప్పెను. రాత్రి మీ యొక్క సేవను పూర్తి చేసి ఆ యొక్క మొత్తము గ్రంథమును పూర్తిగా చదివినాము. కాని ఆ యొక్క సంఘటనలో లేశమాత్రమైన గర్వమును కూడా చూపలేదు.

3. అహింస – సాహసము

  • ఒకసారి ఒక కప్పను పాము తింటూ ఉంటే అది ఏడవడము వినెను. అప్పుడు వీరు అది చూసి ఏడుస్తూ వెంటనే మూర్చపోయిరి. ఈ సంఘటన ప్రాణులపై వారికి గల ప్రేమను తెలియచేస్తుంది.వీరిని శ్రీ రాముని యొక్క అవతారముగా తలుచుదురు, వాల్మీకి రామయణములో చెప్పిన విదముగా, ఎప్పుడైనా అయోద్యలో ఎవరికైనా అశుభము జరిగినచో శ్రీ రాముడు దుఃఖించేవాడు సంతోషము కలిగినప్పుడు వారి కన్నా మొదలు మొదటగా తానే సంతోషపడేవాడు.

4. క్షంతిర్ – సహనము

  • ఎమ్పెరుమానార్ శ్రీ భగవత్ గీతా చరమ శ్లోకము (సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామ్ ఎకమ్ …) అర్థమును శ్రీ తిరుక్కోట్టియుర్ నంబి వద్ద సేవించిరి.  శ్రీ తిరుక్కొష్ఠిమూర్ నంబి ఎమ్పెరుమానారులను వారి యొక్క శిష్యులకి చాలా కష్టమైన పరీక్షలను పెట్టి తదుపరి ఆ యొక్క అర్థమును ఉపదేశించమనిరి. అప్పుడు, కూరత్తాళ్వాన్ వాటి యొక్క అర్థములను అడిగిరి, ఎమ్పెరుమానార్ వారిని దానియందు గల శ్రద్దను చూపమనిరి, కూరత్తాళ్వాన్, మఠము వెలుపల 1 నెల ఉపవాసము ఉండిరి. చివరగా వారు దాని యొక్క అర్థములని ఎంతో ఓపికతో నేర్చుకొనిరి.
  • అలానే వీరు శైవ రాజు ఆస్థానములో తన యొక్క నేత్రములు పోవడానికి కారకులైన నాలూరాన్ ని క్షమించి వారికి మోక్షమును ప్రాసాదించమని అర్థించిరి.

5. ఆర్జవము – నిజాయితీ

  • భగవత్ విషయమై తిరువరంగత్త్ అముదనారులు వీరికి శిష్యులవుదామనుకొనగా, వీరు ఎమ్పెరుమానార్ను ఆశ్రయించమని ఆఙ్ఞాపించిరి.
  • పిల్లై పిల్లై ఆళ్వన్ విషయములో కూడా, కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ ఎమ్పెరుమానార్లపై ఆదారపడమని ఆఙ్ఞాపించిరి.

6. ఆచార్యోపాసనము – ఎల్లప్పుడూ ఆచార్యులపై ఆధార పడడము

  • అప్పుడు శ్రీ రంగములో నివసిస్తున్న గుడ్డి మరియు చెవి వానిపై ఎమ్పెరుమానార్ తమ యొక్క పాదములు ఉంచగా, కూరత్తాళ్వాన్ ఏడుస్తూ ఎమ్పెరుమానార్ యొక్క శ్రీ పాదములను పొందడము కన్నా వేదాంతములను నేర్చుకొనడము అవసరము లేదని వ్యత్యాసమును చూపిరి. “త్రుణీ కృత విరించాది నిరంకుశ విబూతయ: రామానుజ పదామ్బోజ సమాశ్రయణ శాలిన:” ఇది ఆ యొక్క అర్థమును తెలియ చేయును.

7. శౌచం – పరిశుబ్రత – లోపల మరియు బయట

  • ఇటువంటి గొప్ప గుణములు కలిగిన వ్యక్తి తప్పక బాహ్యమున పరిశుబ్రముగానే ఉందురు, తదుపరి ఉదాహారణలో వారి యొక్క హృదయము యొక్క శుభ్రతని తెలుసుకొందాము.
  • అప్పుడు ఎమ్పెరుమానార్ శైవరాజు చర్యల వలన శ్రీరంగమును వడిలి మేల్కోట వెళ్ళిరి, కూరత్తాళ్వాన్ శ్రీరంగములోనే ఉండిరి. ఒక రోజువారు ఆలయములోనికి వెళ్ళిరి, అక్కడ ఒక బటుడు వారిని ఆపి ఈ విదముగా చెప్పెను “ఎమ్పెరుమానార్ సంభందము ఉన్నవారికి ఆలయ ప్రవేశము లేదు ఇది రాజాఙ్ఞ”. కాని ఇంకొక బటుడు ఆ సమయములో ఈ విదముగా అన్నాడు, ”కూరత్తాళ్వాన్ గొప్ప గుణములను కలిగిన వ్యక్తి అందువలన మనము వీరిని లోపలికి పంపుదాము”. అదివిన్న కూరత్తాళ్వాన్ ఇలా చెప్పారు, “నేను ఏమైనా గొప్ప గుణములను కలిగి ఉన్నట్లైతే అందుకు కారణము నాకు ఎమ్పెరుమానార్తో గల సంబంధమే” అని చెప్పి ఆలయము లోనికి వెళ్ళక తిరిగి వెళ్ళెను. అటువంటిది వారి యొక్క శుద్దమైన హృదయము, వేరవరైనా తమను స్వతంత్రముగా గొప్పగా తలుచుదురో, వీరు దానిని అంగీకరించే వారు కాదు, అది శ్రీ రంగనాధుడి దర్శనము గురించి అయినా సరే.

8. స్థైర్యము – స్థిరమైన

  • అప్పుడు కొందరు భక్తులు ఈ విదముగా అడిగిరి“ ఎందుకు శ్రీవైష్ణవులు దేవతంతరములను ఆరాదించరాదు?”, కూరత్తాళ్వాన్ ఈ విదముగా చెప్పిరి, మన పెద్దలు (పూర్వచార్యులు –గొప్ప వేద పండితులు) మునుపెన్నడూ అలా చేయలేదు, అందువలన మనమూ కూడా చేయవద్దు. అదీ వారికి పూర్వచార్యుల యెడల స్థిరమైన నమ్మకము.

9. అత్మ – వినిగ్రహః – స్వీయ నియంత్రణ (వైరాగ్యము)

  • అప్పుడు వారి యొక్క కుమారుల కళ్యానముణకు తగిన సమయము, వారి యొక్క దర్మపత్ని ఇతరులని వారికి తగిన మంచి కన్యల గురించి అడుగుతున్నది. కూరత్తాళ్వాన్ చెప్పిరి “ఈశ్వర కుడుమ్బతుక్కు నామ్ యార్ కరైవతు?” – అర్థము “భగవంతుడి కుటుంబము గురించి మనకు ఎందుకు చింత? అది శ్రీ రంగనాదుడి భాద్యత”.
  • ఎమ్పెరుమానార్ కూరత్తాళ్వాన్ లను కాంచీపురము దేవ పెరుమాళ్ ఎదుట పాడి వారి యొక్క నేత్రముల చూపు గురించి అడుగమని అఙ్ఞాపించగా – కూరత్తాళ్వాన్ తమ చూపు పోవుటకు కారణమైన నాలురాన్ మరియు తమకు మోక్షమును ప్రాసాదించమని అడిగిరి.

10. ఇంద్రియార్థేషు  వైరాగ్యము – మానసిక దారుడ్యము

  • తిరువరంగత్త అముదనార్ తమ యొక్క ద్రవ్యమును (బంగారము, మొద,,) కూరత్తాళ్వాన్ కి సమర్పించగా, కూరత్తాళ్వాన్ వాటిని వీధిలో విసిరి వేసిరి, మరియు ఎమ్పెరుమానార్లకి అనవసరమైన బారములు తమకు వద్దని చెప్పిరి.

11. అంహకార – అహమును కలిగి ఉండక పోవడము 

  • వారు గొప్ప పండితుడైనప్పడికినీ, ధనము కలిగిన వ్యక్తి అయుననూ, మొదలైన, ఎమ్పెరుమానార్ శ్రీ భాశ్యమును కూరత్తాళ్వాన్ వ్రాస్తున్నప్పుడూ కలత చెందిరి, కూరత్తాళ్వాన్ ఈ విదముగా చెప్పెను, “ఎమ్పెరుమానార్ నా స్వామి నేను వారి యొక్క దాసుడను, అందువలన వారికి ఎదనిపించితే నా యెడల అది చేయవచ్చు”.

12. జన్మ – మృత్యు – జరా – వ్యాది – దుఃఖః – దుఖః దోషానుదర్శనము – ఎల్లప్పుడూ సంసారములో తప్పులని వెదుకుట

  • ఒకసారి ఎవరో ఒక బిడ్డకి జన్మని ఇచ్చారని విని, కూరత్తాళ్వాన్ రంగనాధుడి ఎదుటగా వెళ్ళి ఏడ్చిరి. అప్పుడు వారు ఎందుకు అని అడుగగా, ఈ విదముగా చెప్పిరి “సంసారమను జైలులో ఉన్నప్పుడు,ఎవరు నిన్ను దీని నుండి విముక్తి కలిగించుదురో వారి ఎదుట కదా నెను వెళ్ళి అడగాలి. కారణము రంగనాధుడికి తప్ప వేరెవరూ సంసార బంద విముక్తి కలిగించలేరు, అందువలన నేను ఆ యొక్క పుట్టిన శిశువు గురించి వారి ఎదుట దుఃఖించితిమని చెప్పెను”.

13. అశక్తిర్ – నిర్లిప్తత

  • ఎమ్పెరుమానార్లను ఆశ్రయించుటకు శ్రీరంగమునకు అడవి గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు, కూరత్తాళ్వాన్ ధర్మపత్ని భయపడుతూ కనిపించినది. కారణమును అడుగగా తను ఒక బొంగారు పాత్రని (అందులో కూరత్తాళ్వాన్ రోజు ప్రసాదమును తీసుకొనే వారు) తెస్తున్నానని చెప్పెను. అదివిని, దానిని తీసి విసిరి వేసెను, రంగనాధులు మరియు శ్రీ రామానుజులు మనకు అక్కడ ఉండగా ఈ యొక్క పాత్ర అవసము ఏమి? అని అడిగిరి. దీనిని బట్టి వారికి వస్తువులపై లేచాయ మాత్రమైనా వ్యామోహము లేదని చూపును.

14. పుత్ర దార గృహాదిషు అనభిస్వంగ: – భార్య, కుమారులు, గృహము మొదలైన వాటితో సంబంధము లేకపోవడము

  • తన యొక్క మొత్తము దనమూ ఇచ్చి వేయడమే కాక, శ్రీరంగము చేరిన పిదప వారు తమ యొక్క రోజు అవసరములకై ఉంజ వృత్తి (బిక్ష) చేసెడివారు. వారు కుటుంబమును కలిగి ఉన్నప్పడికినీ, వారు శాస్త్రములలో చెప్పిన విదముగా నడుచుకొనే వారు.
  • అప్పుడు వారు తమ యొక్క శిష్యులకు రహస్య త్రయమును (తిరుమంత్రము, ద్వయము, చరమ శ్లోకము) ఉపదేశిస్తూ, వారు మొదట తమ యొక్క కుమారులను వెళ్ళమని చెప్పిరి –కాని తరువాత రమ్మని రహాస్యార్థములను చెప్పిరి. ఎందుకు అలా అని అడుగగా, “ఎవరు చెప్పగలౌ వారు ఎంత కాలము జీవించుదురో, వారు వారి యొక్క జీవితమును ఇంటికి వస్తున్నప్పుడూ కూడా విడువవచ్చు, అందువలన నేను వారికి ఉపదేశించదల్చితినని చెప్పిరి”. ఈ యొక్క సంఘటన, వారి యొక్క కుమారులగుటచే కరుణతో కాక, ఆత్మలుగా వారిని చూసి సంసారము నుండి విముక్తులవ్వుటకు ముందు సరియగు ఙ్ఞానమును కలిగి ఉండవలెనని ఈ విధముగా చేసిరి.
  • ఇది వారికి తమ దర్మ పత్నితో ఎటువంటి శారీరక సంభదమును పెట్టుకొనలేదని మరియు వారి కుమారులైన  (పరాశర భట్టర్ మరియు వేదవ్యాస భట్టర్)శ్రీ రంగనాధుల ప్రసాదము వలన కలిగిరి.

15. ఇష్టానిష్టోపపత్తిషు నిత్యమ్ సమ-చితత్వము – సందర్భ మరియు అసందర్భ సమయములలో ఒకే విధముగా ఉండడము

  • కూరత్తాళ్వాన్ వారి యొక్క దృష్టిని కోల్పోయి నప్పుడూ భాదపడలేదు. వారు ఈ విధముగా చెప్పిరి“ ఏమి ప్రయోజనము ఈ యొక్క నేత్రములతో  ఒక భగవత్ విరోధి అయిన రాజుని చూసిన తరువాత”. అప్పుడు ఎమ్పెరుమానార్ వారిని శ్రీ కంచి వరదులను దృష్టిని ప్రసాదించమని ఆఙ్ఞాపించగా, కూరత్తాళ్వాన్ ఈ విధముగా అన్నారు “నేను ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమాన్ ఇద్దరిని నా యొక్క అంతర్ నేత్రములతో దర్శిస్తున్నాను, అందు వలన బాహ్యపు నేత్రములతో పని ఏమి?”.

16. మయి అనన్య – యోగేన భక్తిః అవ్యభిచారిణీ – నా (కృష్ణుడి) యందు స్థిరమైన భక్తిని కలిగి ఉండడము

  • వారికి ఏవిధమై నటువంటి ఆటంకములైన ఎదురైననూ, తమ యొక్క దృష్టిని కోల్పోయిననూ, శ్రీరంగమును వదిలి వెళ్ళినప్పుడూ, మొదలగు.. కూరత్తాళ్వాన్ ఎమ్పెరుమాన్ యెడల స్థిరమైన భక్తీని కలిగి ఉండిరి. వారు ఎప్పుడూ కూడా వేరవరినీ ఆశ్రయించలేదు, అలానే భగవంతుని అందు పూర్తిగా భక్తిని తప్ప మరొకటీ అడుగలేదు.

17. వివిక్త దేశ సేవిత్వము – ఒంటరి ప్రదేశములో నివసించుట

  • ఒక శ్రీవైష్ణవుడు, ఒంటరి ప్రదేశములు అనగా ఎక్కడైతే భగవత్ సంభందమైన కార్యక్రమములు జరుగునో అక్కడ నివసించడు. కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ వారి యొక్క ఆచార్యులైన ఎమ్పెరుమానారుతో ఉండి ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమాన్ యొక్క సేవలను గురించి ఆలోచించెడెవారు.

18. అరతిః జన సంసది – ప్రజా సమూహము నందు ఇష్టము లేకపోవడము

  • గొప్ప భక్తులైనప్పడికినీ సామానులైన ప్రజలతో కలిసిఉందురు, వారి యెడల ఎటువంటి సంభదమును కలిగిఉండరు. కూరత్తాళ్వాన్ సామాన్యులైన ప్రజలతో కలిసి ఉన్నప్పడికినీ (రాజులు, మొదలగువారు) వీరి నుండి సూచనలను తిసుకోనెడివారు, కాని వారి యందు ఎటువంటీ సంబంధమును కలిగి ఉండెరివారు కాదు .

19. అద్యాత్మ ఙ్ఞాన నిత్యత్వము – శాశ్వతమైన ఆధ్యాత్మిక ఙ్ఞానమును కలిగి ఉండడము

  • చిన్న వయస్సు నుండి, కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ అందరూ జీవాత్మలు భగవంతుడికి సేవకులుగానే గుర్తించెడివారు.

20. తత్త్వ ఙ్ఞాన అర్థ చింతనము – అసలైన ఙ్ఞానమును గురించి ఆలోచించడము

  • కూరత్తాళ్వాన్ ఎల్లప్పుడూ తత్వ ఙ్ఞానము కొరకై ఆలోచించెడివారు – అందరూ జీవాత్మలు శ్రీమన్ నారయణుడి సేవకులనే తలిచెడివారు. అందువలన వారు తమ యొక్క ప్రాకృత శరీరమును వదిలి పరమపదమును చేరినప్పుడూ, ఎమ్పెరుమానార్ అక్కడ ఉన్న శ్రీవైష్ణవులని ద్వయ మహా మంత్రమును కూరత్తాళ్వాన్ యొక్క చెవులలో చదువని చెప్పిరి, కారణము వారు ఎల్లప్పుడూ దానిని గురించి ఆలోచించెడివారు.

ముగింపు:

ఒకే వ్యక్తిలో ఇన్ని గొప్ప గుణములను కలిగిఉండడము చూడడము చాలా అద్భుతము. అందువలన పెరియ వాచ్చాన్ పిళ్ళై ఈ విధముగా చెప్పిరి “ఆచార్యుల మరియు శిష్యుల యొక్క లక్షణములను పూర్తిగా కూరత్తాళ్వన్ కలిగిఉండెను” అని తమ యొక్క మానిక్కా మాలైలో చెప్పిరి. మనమూ కూరత్తాళ్వాన్ జీవితములోని కొన్ని ఉదహారణలైనా మన యొక్క జీవితములో అన్వయించుటకూ ప్రయత్నిద్దాము.

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://guruparamparai.wordpress.com/2013/10/05/kurathazhwan/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

16 thoughts on “కూరత్తాళ్వాన్

  1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

  2. Pingback: 2014 – Nov – Week 5 | kOyil

  3. Pingback: ముదలియాణ్డాన్ | guruparamparai telugu

  4. Pingback: కిడాంబి ఆచ్చాన్ | guruparamparai telugu

  5. Pingback: వడుగ నంబి | guruparamparai telugu

  6. Pingback: వంగి పురత్తు నంబి | guruparamparai telugu

  7. Pingback: 2015 – Feb – Week 2 | kOyil – srIvaishNava Portal for Temples, Literature, etc

  8. Pingback: తిరువరంగత్తు అముదనార్ | guruparamparai telugu

  9. Pingback: ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ | guruparamparai telugu

  10. Pingback: వేదవ్యాస భట్టర్ | guruparamparai telugu

  11. Pingback: నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ | guruparamparai telugu

  12. Pingback: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ | guruparamparai telugu

  13. Pingback: కణ్ణినుణ్ శిరుతాంబు – 3 – తిరితంతాగిలుం | dhivya prabandham

  14. Pingback: ఎంగళాళ్వాన్ | guruparamparai telugu

  15. Pingback: కూర నారాయణ జీయర్ | guruparamparai telugu

  16. Pingback: పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ | guruparamparai telugu

Leave a comment